GST: జీఎస్టీ ఎగవేతపై డీజీజీఐ ఉక్కుపాదం.. రూ.50 కోట్లకు పైగా పన్ను మోసాలు.. ఇద్దరు ఎండీలు అరెస్టు
- జీఎస్టీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డ ఇద్దరు ప్రముఖ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు
- రూ.50 కోట్లకు పైగా పన్ను మోసాలు
- ఇద్దరు ఎండీలు అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంఘటిత జీఎస్టీ (GST) పన్ను ఎగవేత కేసులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులను మరింత ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్, అంతర-ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో, భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర పన్ను మోసాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డ ఇద్దరు ప్రముఖ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. 2025 జనవరి 6న జరిగిన ఈ అరెస్టులు పన్ను మోసాల తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.
Also Read
- 144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
రూ.28.24 కోట్ల జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయని ఎండీ
మెస్ర్స్ ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (M/s Orange Passenger Transport Pvt Ltd) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన రూ.28.24 కోట్ల జీఎస్టీని గడువు ముగిసిన మూడు నెలలు గడిచినా ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా అక్రమంగా దాచుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.
రూ.22 కోట్ల నకిలీ ఐటీసీ మోసం
అదే విధంగా, మెస్ర్స్ ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ (M/s Trillion Lead Factory Pvt Ltd) మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ ఎన్ (Chethan N) రూ.22 కోట్ల మేర నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) మోసానికి సూత్రధారిగా వ్యవహరించినట్టు డీజీజీఐ గుర్తించింది.
Also Read:Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్
CGST చట్టం ప్రకారం అరెస్టు
ఈ ఇద్దరిపై సీజీఎస్టీ చట్టం–2017 నిబంధనల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. సంఘటితంగా జరుగుతున్న పన్ను మోసాలపై నిరంతర ఒత్తిడి కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులు చట్టాన్ని గౌరవిస్తూ వ్యవహరించాలని, జీఎస్టీ ఎగవేతకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని డీజీజీఐ హెచ్చరించింది.
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!