GIS Summit: గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు అంతా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. విశాఖ కేంద్రంగా రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమ్మిట్ లో రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఇవాళ సమీక్షించారు. మరో మూడు రోజుల్లో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరుగనుంది.
Read Also:Twitter Layoff: డేటా ఎక్స్పర్ట్స్, ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన ట్విట్టర్
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
వచ్చే నెల 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతి నుంచి పరిశ్రమలు రావటం లేదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా కారణంగా మొదటి రెండేళ్లు ఆర్ధిక కార్యక్రమాలే జరగని పరిస్థితి నెలకొంది. పైగా వచ్చే ఎడాది ఎన్నికలు కావటంతో ఇప్పుడు జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఆదానీ, అంబానీలు సైతం ఈ సమ్మిట్ కు వచ్చే విధంగా కసరత్తు చేశారు. మొదటి రోజు జాతీయ, అంతర్జాతీయ బడా పారిశ్రామిక వేత్తలతో సమ్మిట్ కళకళలాడనుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రెండో రోజు ఒప్పందాలు చేసుకునే ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి.
ఇటు ముఖ్యమంత్రి జగన్ ఇవాళ జీఐఎస్ పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేపట్టారు. ఇప్పటి వరకు 25 దేశాల నుంచి 7, 500 మంది డిలిగేట్స్ ఈ సమ్మిట్ కు రిజిష్టర్ చేసుకున్నట్లు సమాచారం. వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీవీఐపీల తాకిడి వల్ల సిటీలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా రూటింగ్ చేయటం, ఎక్కడికక్కడ సమ్మిట్ కు దారి తెలిసే విధంగా భారీ ఎత్తున హోర్డింగ్స్ , సిటీ గ్రీనరీ, బ్యూటిఫికేషన్ వంటి అనేక అంశాల పై ముఖ్యమంత్రి జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also: Missing: డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది.. నెలరోజులు గడిచింది అయినా
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!