Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Analysis People Of Andhra Pradesh Will Support Which Party In Next Elections

జగన్, చంద్రబాబు.. ఎవరి ఫేస్ వాల్యూ ఎంత?

Published Date :September 24, 2021 , 2:31 pm
By Lakshmi Narayana
జగన్, చంద్రబాబు.. ఎవరి ఫేస్ వాల్యూ ఎంత?
  • Follow Us :
  • google news
  • dailyhunt

గెలుపోటములు దైవాదీనం. ఎవరినీ ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ముందుగానే చెప్పడం కష్టం. రాజకీయాల్లోనూ ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే తెలుసుకొని చిత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే జనాల్లో ఫేస్ వాల్యూను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీ అధినేత చరిష్మా కూడా తోడైతే ఇక అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. కేవలం అధినేత ఫొటోతోనే గెలుపు సాధ్యమా? అంటే ఇందులో కొంత వాస్తవం ఉందనే చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాలతోపాటు పక్కనే ఉన్న తమిళనాడు, మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఫార్మూలా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది.

ఒకప్పుడు ఎన్నికలంటే కాంగ్రెస్.. లేదంటే బీజేపీ.. మరీ అయితే కమ్యూనిస్టుల మధ్యే నడిచేది. నాడు ఓటర్లంతా పార్టీలను చూసి ఓటేసేవాళ్లు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఎంటరయ్యాయో సీన్ మొత్తం మారిపోయింది. జాతీయ పార్టీలను తలదన్నేలా ప్రాంతీయ పార్టీలే ఆయా రాష్ట్రాల్లో హవా కొనసాగిస్తున్నాయి. ఈ పార్టీల సపోర్టు లేకుండా జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడం అనేది కష్టంగా మారింది. దీంతో రాష్ట్రాల్లోనూ ఇబ్బడిముబ్బడిగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే సత్తాచాటుతూ ఎక్కువకాలం రాజకీయంగా మనగలుగుతున్నాయి.

ప్రాంతీయ పార్టీలన్నీ ఏక నాయకత్వంపైనే పని చేస్తుంటాయి. అధినేత చరిష్మాపైనే ఆపార్టీ మనుగడ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఫేస్ వాల్యూ తెరపైకి వచ్చింది. ఆయన ఫొటో పెట్టుకుంటే గెలుస్తామనే నమ్మకం అభ్యర్థుల్లో ఏర్పడింది. ప్రజలు సైతం పార్టీ అధినేత చూసి ఓట్లు వేయడం ప్రారంభించారు. ఆయన తర్వాత అంతటి చరిష్మా కలిగిన నేతగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. హస్తం గుర్తుకు ‘వైఎస్’ ఇమేజ్ తోడు కావడంతో కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు నాడు అధికారంలోకి వచ్చింది. ఆయన మరణం తర్వాత ఏపీ, తెలంగాణలోనూ ఈ పంథానే కొనసాగుతూ వస్తోంది.

2019 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మతోనే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. తండ్రి అడుగు జాడల్లోనూ నడుస్తున్నారు. ఏపీలో సంక్షేమమే ప్రధాన ఏజెండా ముందుకెళుతున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ వైఎస్ బొమ్మతోపాటు సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఫొటోతో జనాల్లోకి వెళ్లనున్నారు. దీంతో జనాలు వైసీపీని ఖచ్చితంగా ఆదరిస్తారని సీఎం జగన్ నమ్ముతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం చంద్రబాబు ఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. దీంతో ఏపీలో ఎవరి ఫేస్ వాల్యూ ఎంత అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈక్రమంలోనే టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో తాము చంద్రబాబు ఫొటోతోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాకర్తలు అవసరం లేదని పరోక్షంగా వైసీపీని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీని నుంచి గెలిచిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తాను తన బొమ్మతోనే గెలిచానంటూ మధ్యలో దూరిపోతున్నాడు. కిందటి ఎన్నికల్లో జనాలు జగన్ బొమ్మ కంటే తన ఫొటోను చూసే ఓట్లు వేశారంటూ చెబుతున్నాడు. దీంతో ఎవరీ ఫేస్ వాల్యూ ఎంత అనేది తేల్చేందుకు జనాలు కూడా సిద్ధమవుతున్నారు. అయితే అభ్యర్థులు కేవలం అధినేత చరిష్మా పైనే ఆధారపడకుండా జనాల్లో తమకంటూ ఓ ఫేస్ వాల్యూను పెంచుకుంటూనే ‘విజయలక్ష్మి’ వరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకేందుకు ఆలస్యం జనాల్లోకి కదలండి మరీ..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Chandrababu Naidu
  • CM Jagan Mohan Reddy
  • tdp
  • ycp

తాజావార్తలు

  • Women Reservation Law: అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ

  • Mahela Jayawardene: “హార్దిక్ ఒక్కడే బాధ్యుడు కాదు”.. ముంబై వరుస ఓటములపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..

  • Israel-Lebanon: ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం.. లెబనాన్‌లో సంబరాలు

  • Arshdeep Singh History: ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ‘సెంచ‌రీ’.. ఏకైక బౌలర్‌గా అరుదైన రికార్డు!

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions