Traffic Challan: బైక్ లేదు.. కార్ డ్రైవ్ చేయలేదు.. అయినా ట్రాఫిక్ చలాన్.. ఇదేక్కడి విడ్డూరం సార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెహికిల్స్ కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, బైక్ మీద వెళ్లేవారు అయితే హెల్మెట్, కారులో వెళ్లేవారు అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలనే రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే రోడ్డు మీద ఏ ట్రాఫిక్ పోలీస్ మన వాహనాన్ని ఆపినా.. సంబంధిత పత్రాలు చూపించి రయ్ మని వెళ్లొచ్చు. ఇక ఇందులో ఏ ఒక్కటీ లేకపోయినా ట్రాఫిక్ పోలీసులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బైక్ లేకపోయినా.. కారు నడపకూండనే ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు. అది చూసి ఆమె ఖంగుతిన్నారు. ఇదేం విచిత్రమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Internet Apocalypse: రెండేళ్లలో “సోలార్ మాగ్జిమమ్”కి సూర్యుడు.. ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసం అవుతుందా..?
Also Read
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
- Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
- Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
- Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
గ్రేటర్ నోయిడాలోని హోషియార్ పూర్ పరిధిలో నివసించే శైలజా చౌదరీ అనే మహిళకు గత శుక్రవారం ఒక ఈ- చలాన్ వచ్చింది. ఆమెకు జూన్ 27 వ తేదీన గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చలానా వేసినట్లు.. తన బైక్ కి రూ. 1000 జరిమానా విధించారు.. కానీ.. తన పేరు మీద అసలు ఎలాంటి బైక్ రిజిస్టర్ అయి లేదని శైలజా చౌదరీ తెలిపారు. తనకు కారు మాత్రమే ఉందని.. ఆ రోజు కారులో హోషియార్ పూర్ ప్రాంతంలో ప్రయాణించ లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. అసలు తనకు బైకే లేకుండా.. కారులో ప్రయాణించకుండా ఎలా చలానా వేస్తారని ట్రాఫిక్ పోలీసులను ఆమె ప్రశ్నించింది.
Read Also: CM YS Jagan: కేబినెట్ భేటీలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలకు సిద్ధంకండి..
తన పేరు మీద కేవలం హ్యూందాయ్ ఐ20 కారు మాత్రమే ఉందని.. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ చలాన్ వేశారని శైలజా చౌదరీ ఆరోపించారు. వెంటనే దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రీతీ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ట్రాఫిక్ చలానాలు వేసేందుకు తాము ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉపయోగిస్తామన్నారు.. దీని ద్వారా ఆటోమెటిక్గా వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తిస్తుందన్నారు. అలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాటుల వల్ల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పుగా డిటెక్ట్ చేస్తుందని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. తప్పుగా ఉన్న చలానాలను తొలగిస్తామని ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..