CM YS Jagan: కేబినెట్ భేటీలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలకు సిద్ధంకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాకులోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పలు కీలకమైన అంశాలకు ఆమోద ముద్ర కూడా లభించింది.. మూడున్నర గంటలపాటు 55 అంశాలపై ఈ భేటీ కొనసాగగా.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది.. అలాగే.. అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.. మరోవైపు కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం వైఎస్ జగన్.
కేబినెట్ భేటీలో అజెండాలోని అంశాలపై చర్చ తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. ఎన్నికలకు సిద్ధంకండి అంటూ మంత్రులకు సూచించారు.. మరో 9 నెలల్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. జగనన్న సురక్షా క్యాంపైన్ ను మంత్రులు పర్యవేక్షించాలని తెలిపారు.. ఈ కార్యక్రమం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి.. గడప గడపకు మన ప్రభుత్వంపై కూడా మీ పర్యవేక్షణ ఉండాలి.. మంత్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాలి.. సొంత జిల్లాల్లోనే కాకుండా ఇంఛార్జ్ జిల్లాల్లోనూ మంత్రుల పర్యటనలు, పర్యవేక్షణ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Sreesanth Challenges Harbhajan: "దమ్ముంటే రింగ్లోకి రా.!" హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
- Akshara Gupta: దేశీయ క్రికెట్లో విధ్వంసం.. 126 బంతుల్లోనే 306 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ కంటే డేంజర్గా ఉందే.!
- Mojtaba Khamenei: "ఆయన హామీతోనే ఓకే చెప్పా".. అమెరికా-ఇరాన్ డీల్పై సుప్రీంలీడర్ షాకింగ్ కామెంట్స్..
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
ఇక, జులై నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈనెల 18వ తేదీన జగనన్న తోడు.. ఈ నెల 20న సీఆర్డీఏ ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం.. ఈ నెల 21వ తేదీన నేతన్న నేస్తం కింద లబ్ధిదారులకు నిధులు జమ.. ఈనెల 26వ తేదీన సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాగా, ఇవాళ్టి కేబినెట్ భేటీలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలుకు ఆమోదముద్ర వేసింది.. ఏపీ సీఆర్డీఏ (APCRDA)లో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్.. అసైన్డ్, లంక భూములపై హక్కులు కల్పించేలా ఆమోదం తెలిపింది మంత్రి మండలి.. ఇక, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన 22(A) లో ఉన్న భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగింపుకు ఆమోద ముద్ర పడింది.. యూనివర్సిటీల్లో శాశ్వత అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ఆమోద ముద్ర వేసింది మంత్రి మండలి.. మరోవైపు.. SIPB ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
తాజావార్తలు
-
Vivo Y6e 5G: Snapdragon 4 Gen 2 చిప్సెట్, 6,500mAh బ్యాటరీతో.. వివో Y6e 5G స్మార్ట్ఫోన్ విడుదల
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Radhamohan Mishra: తానే దేవుడి స్వరూపమని చెప్పుకుంటూ.. మహిళను ఏళ్ల తరబడి హింసించి అత్యాచారం.. మూత్రం తాగాలని బలవంతం
-
Akshara Gupta: దేశీయ క్రికెట్లో విధ్వంసం.. 126 బంతుల్లోనే 306 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ కంటే డేంజర్గా ఉందే.!
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..