వారిని హెచ్చరించిన బండి సంజయ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 30 వ తేదీన రంగారెడ్డి అర్బన్ జిల్లా లింగోజీగూడ డివిజన్ కు జరుగుతున్న ఉపఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి రంగారెడ్డి జిల్లా బిజెపి జిల్లా కమిటీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ని కలిసిన సందర్భంగా ఏర్పడిన పరిస్థితులపై, కలవడానికి దారితీసిన పరిస్థితులపై వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే బిజెపి రాష్ట్ర పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా లింగోజిగూడ డివిజన్ నుంచి గెలిచిన ఆకుల రమేష్ గౌడ్ అకాల మరణం వల్ల ఏర్పడిన ఖాళీకి జరుగుతున్న ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి… ఏకగ్రీవం కావడానికి తాము అనుకూలమేనని టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతిపాదించిన విషయం అందరికి తెలిసిందే.
దివంగత బిజెపి నాయకుడు రమేష్ గౌడ్ కుటుంబంలోని సభ్యుడికి ఆ డివిజన్ లో కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కోసం మార్గం సుగమం చేస్తామని ప్రతిపాదించిన నేపథ్యంలోనే ఈ అంశం చర్చనీయంగా మారింది. గత ఎన్నికలలో ఎల్బీనగర్ లోని అన్ని మున్సిపల్ డివిజన్లలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత లింగోజిగూడ డివిజన్ లో బిజెపి మరోసారి విజయం సాధించడం ఖాయమని, పోటీ చేయడానికి బిజెపి సిద్ధమైంది.
Also Read
అయితే ఈ ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండా, ఈ విషయాన్ని చర్చించకుండా కేటీఆర్ ను ప్రత్యక్షంగా కలవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ అంశంలో ఈ బృంద నాయకులు ఎవ్వరు కూడా సీనియర్ నాయకులతో చర్చించకపోవడం, వారి అభివప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేటీఆర్ ని కలవడం కూడా పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని బిజెపి రాష్ట్ర పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డితో గాని, డా.కె. లక్ష్మణ్ తో గాని చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్యగా రాష్ట్ర పార్టీ భావిస్తోంది.
జరిగిన సంఘటన పట్ల పూర్తిస్థాయిలో విచారణ జరపాలని భావించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర నాయకుల అనుమతి లేకుండా ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని కలిసిన విషయంలో జరిగిన అన్ని విషయాలను నిగ్గుతేల్చాలని బిజెపి రాష్ట్ర పార్టీ భావిస్తోంది. ఈ సంఘటన తర్వాత కొన్ని పత్రికలలో, ప్రచార సాధనాలలో, వెబ్ చానళ్లలో బిజెపి సీనియర్ నాయకులపై తప్పుడు కథనాలను ప్రసారం చేయడాన్ని బిజెపి రాష్ట్ర పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గాని, వివిధ చానళ్లలో వచ్చిన కథనాలలో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ కథనాలన్నీ ఊహజనితమైన అభూతకల్పనలే. ఈ తప్పుడు కథనాలతో పాటు జరిగిన విషయాలపై సమగ్ర విచారణ జరుగుతుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం చేస్తే తగు చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం అని తెలిపారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!