Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఈ అల్పపీడనం కొనసాగుతుంది.. తెలంగాణా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు…
ఈ క్రమంలో ములుగు, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నల్గొండ జిల్లా, మహబూబాబాద్, భూపాలపల్లి తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. ఈ జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్ ను జారీ చేశారు.. ఈ అల్పపీడన ప్రభావం ఏపీ పై కూడా పడిందని తెలుస్తుంది.. పార్వతీపురం, ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు..
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. మరోవైపు హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు నీటి ముంపులోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగానే ఉన్నాయి. లంగర్ హౌస్, అహ్మద్ నగర్ కాలనీ వాసులు నరకం చూస్తున్నారు. ఇళ్లలోకి వాన నీరు రావడంతో జనాలు రాత్రంతా జాగారాలు చేయాల్సి వచ్చింది. భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తింది. మూసికి వరద ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసారాంబాగ్ బ్రిడ్జ్పై రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించడం లేదు. చాదర్ఘాట్ కాజ్ వే వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది.. రోడ్లు మూసివెయ్యడం తో వాహన దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..ఈ వర్షాల పై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.. ప్రజలు ఎట్టి పరిస్థితులలోను బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు..
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!