Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Survey: మన దేశంలో వివాహ వ్యవస్థ.. కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయని మన అందరం అనుకుంటాం. అయితే తాజా గణాంకాలు మాత్రం ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా భాగస్వామి లేని మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. విడాకులు తీసుకున్నవారు.. భర్త చనిపోయినవారు.. ఒంటరిగా ఉంటున్న మహిళల శాతం జాతీయ సగటు కంటే సౌత్లోనే ఎక్కువగా ఉందట… ఈ పరిస్థితికి కారణం ఏంటి…???
దేశంలో భాగస్వామి లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్యపై శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. జాతీయ స్థాయిలో ఈ సంఖ్య కాస్త తగ్గినా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ శాతం ఆందోళనకరంగా ఉంది. విడాకులు తీసుకున్నవారు, భర్త చనిపోయినవారు, భర్తకు దూరంగా ఉంటున్న వారి సంఖ్య ఐదు దక్షిణ భారత రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉంది. జాతీయ స్థాయిలో భాగస్వామి లేని మహిళల సగటు 5.4 శాతంగా ఉంటే పురుషుల శాతం కేవలం 1.6 శాతంగా నమోదైంది.
Also Read
- Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
- Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. తమిళనాడు ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడులో అత్యధికంగా 11.6 శాతం మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. కేరళ 10.4 శాతంతో రెండో స్థానంలో ఉండగా.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 8.6 శాతంతో ఉన్నాయి. తెలంగాణలో ఈ సంఖ్య 7.6 శాతంగా రికార్డ్ అయింది. ఇక దేశంలో అత్యల్పంగా బీహార్లో కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే భాగస్వామి లేకుండా ఉన్నారు.
మహిళల వివాహ వయసుకు సంబంధించి కూడా ఈ రిపోర్ట్ కీలక విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు తగ్గుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. జాతీయ స్థాయిలో 2.1 శాతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపే వివాహం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 6.3 శాతం, జార్ఖండ్లో 4.9 శాతం బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో బాల్య వివాహాలు దాదాపు సున్నా స్థాయికి చేరుకోవడం విశేషం.
పట్టణ.. గ్రామీణ ప్రాంతాల మధ్య మహిళల వివాహ వయసులో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటు వివాహ వయసు 22.6 ఏళ్లుగా ఉంటే.. పట్టణాల్లో ఇది 24.4 ఏళ్లుగా ఉంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో మహిళలు వివాహాన్ని కాస్త ఆలస్యంగా చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యాశాతం, ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువగా ఉండటమే విడాకులు, ఒంటరి జీవనానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న మహిళలు రాజీ పడి జీవించేందుకు ఇష్టపడకపోవడం కూడా ప్రధాన కారణం.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!