Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Survey: మన దేశంలో వివాహ వ్యవస్థ.. కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయని మన అందరం అనుకుంటాం. అయితే తాజా గణాంకాలు మాత్రం ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా భాగస్వామి లేని మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. విడాకులు తీసుకున్నవారు.. భర్త చనిపోయినవారు.. ఒంటరిగా ఉంటున్న మహిళల శాతం జాతీయ సగటు కంటే సౌత్లోనే ఎక్కువగా ఉందట… ఈ పరిస్థితికి కారణం ఏంటి…???
దేశంలో భాగస్వామి లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్యపై శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. జాతీయ స్థాయిలో ఈ సంఖ్య కాస్త తగ్గినా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ శాతం ఆందోళనకరంగా ఉంది. విడాకులు తీసుకున్నవారు, భర్త చనిపోయినవారు, భర్తకు దూరంగా ఉంటున్న వారి సంఖ్య ఐదు దక్షిణ భారత రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉంది. జాతీయ స్థాయిలో భాగస్వామి లేని మహిళల సగటు 5.4 శాతంగా ఉంటే పురుషుల శాతం కేవలం 1.6 శాతంగా నమోదైంది.
Also Read
- Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
- Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
- Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. తమిళనాడు ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడులో అత్యధికంగా 11.6 శాతం మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. కేరళ 10.4 శాతంతో రెండో స్థానంలో ఉండగా.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 8.6 శాతంతో ఉన్నాయి. తెలంగాణలో ఈ సంఖ్య 7.6 శాతంగా రికార్డ్ అయింది. ఇక దేశంలో అత్యల్పంగా బీహార్లో కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే భాగస్వామి లేకుండా ఉన్నారు.
మహిళల వివాహ వయసుకు సంబంధించి కూడా ఈ రిపోర్ట్ కీలక విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు తగ్గుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. జాతీయ స్థాయిలో 2.1 శాతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపే వివాహం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 6.3 శాతం, జార్ఖండ్లో 4.9 శాతం బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో బాల్య వివాహాలు దాదాపు సున్నా స్థాయికి చేరుకోవడం విశేషం.
పట్టణ.. గ్రామీణ ప్రాంతాల మధ్య మహిళల వివాహ వయసులో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటు వివాహ వయసు 22.6 ఏళ్లుగా ఉంటే.. పట్టణాల్లో ఇది 24.4 ఏళ్లుగా ఉంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో మహిళలు వివాహాన్ని కాస్త ఆలస్యంగా చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యాశాతం, ఆర్థిక స్వాతంత్ర్యం ఎక్కువగా ఉండటమే విడాకులు, ఒంటరి జీవనానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న మహిళలు రాజీ పడి జీవించేందుకు ఇష్టపడకపోవడం కూడా ప్రధాన కారణం.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్