India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- భారత అణు విధానంలో స్పష్టమైన మార్పు..
- తొలిసారిగా 12 అణు వార్హెడ్ల మోహరింపు..
- వివరాలు వెల్లడించిన సిప్రి రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: అణు ఆయుధ విధానంలో భారత్ స్పష్టమైన మార్పు చేసినట్లు తెలుస్తోంది. భారత్ తొలిసారిగా 12 అణు వార్హెడ్లను మోహరించినట్లు స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దశాబ్ధాలుగా అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరుగా ఉంచే విధానాన్ని భారత్ అవలంభిస్తోంది. కానీ తాజా నివేదిక ప్రకారం, భారత్ ప్రయోగించే స్థితిలో అణు ఆయుధాలను ఉంచినట్లు తెలుస్తోంది.
భూగర్భ క్షిపణి స్థావరాలలో, కొత్త అణు జలాంతర్గాములలో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న అణ్వాయుధాలను మోహరించినట్లు నివేదిక వెల్లడించింది. ఇది దేశ అణ్వాయుధ సంసిద్ధతను సూచిస్తోంది. ఇప్పటి వరకు భారత్ శాంతికాలంలో అణు వార్హెడ్లను క్షిపణుల నుంచి వేరే చేసి భద్రపరస్తుందనే అభిప్రాయం ఉండేది. అయితే, ఇటీవల క్షిపణులను కానిస్టర్లలో నిల్వ చేయడం, అణు సామర్థ్యం కలిగిన జలంతర్గాముల్లో మోహరించడం వంటివి చేసిందని నివేదిక చెప్పింది.
Also Read
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
ఇదిలా ఉంటే, భారత్ అణు విధానంలో ‘‘నో ఫస్ట్ యూజ్’’ పాలసీని కొనసాగిస్తోంది. భారత్ ఎప్పటికి ఎవరిపై కూడా ముందుగా అణు దాడి చేయదు. ఒక వేళ భారత్ భూభాగం, భారత సైన్యంపై అణు దాడి జరిగితే మాత్రమే ప్రతీకార చర్యగా అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది. మరోవైపు, భారత్ తన అణ్వాయుధాల నిల్వను పెంచుకున్నట్లు నివేదిక వెల్లడించింది. భారత్ వద్ద జనవరి 2026 నాటికి 190 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఇది పాకిస్తాన్ కన్నా ఎక్కువ అని చెప్పింది.
తాజావార్తలు
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది?
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..