ఏపీలో వింత ప్రభుత్వం… వింతైన సీఎం ఉన్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర రాష్ట్రంలో వింత ప్రభుత్వం… వింతైన ముఖ్యమంత్రి వున్నారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం కాదా…!? అంటూ ఫైర్ అయిన ఆయన.. చంద్రబాబును కాల్చాలని నంద్యాల బహిరంగ సభలో జనాన్ని రెచ్చగొట్టిన జగన్ పై కేసులు ఎందుకు నమోదు చేయలేదు… అప్పుడు సీఐడీ ఏం చేస్తోంది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… ప్రస్తుతం రాష్ట్రంలో వింత ప్రభుత్వం ఉంది.. వింతైన సీఎం వున్నారు.. ఇక్కడ అప్రకటిత నియంత పాలన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో ఉందా ? లేక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు విష్ణుకుమార్ రాజు.. ఎంపీ రఘురామ కృష్ణపై దాడి ఆరోపణలు నిజమని తేలితే అంత కంటే హేయమైన చర్య మరొకటి ఉండదన్న ఆయన.. రఘురామ కృష్ణం రాజుపై దాడి నిర్ధారణ అయితే అది పార్లమెంట్ పై దాడిగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్న బీజేపీ నేత.. ఎంపీ రఘురామ కృష్ణరాజుకు తగిలిన గాయాలపై ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యుల బృందంతో నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కక్ష సాధింపు చర్యలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు మినహాయింపు కాదని రఘురామ కృష్ణంరాజు అరెస్ట్, తర్వాత పరిణామాలు హెచ్చరికాగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు భయ భ్రాంతులు కాకుండా ఉండాలంటే శనివారం, ఆదివారం కోర్టులు తెరిచి ఉంచాలి…. కోవిడ్ నియంత్రణలో విఫలమైన జగన్ ముఖ్యమంత్రి బాధ్యతలు నుంచి తప్పుకుని ఆయన భార్యకు కానీ ఇతరులకు కానీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు విష్ణుకుమార్ రాజు.
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?