టీమిండియాలో రోహిత్ శర్మ స్పెషల్.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా జట్టులో రోహిత్ శర్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టీమ్లో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. పాకిస్థాన్తో జరగనున్న మ్యాచ్లో అతడిపై చాలా అంచనాలున్నాయి. అయితే అతడు చాలా స్పెషల్. ఎందుకంటే 2007లో టీమిండియా ఆడిన ప్రపంచకప్ జట్టులో.. ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న ఒకేఒక్కడు రోహిత్ మాత్రమే. 2007లో 20 ఏళ్ల వయసులోనే రోహిత్ ప్రపంచకప్ ఆడాడు. అప్పుడు జట్టులో అతడే యువకుడు. ఇప్పుడు మాత్రం అతడు సీనియర్.
Read Also: పాక్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు : కోహ్లీ
Also Read
2007 ప్రపంచకప్లో ఆడిన దిగ్గజ ఆటగాళ్లు ధోనీ, హర్భజన్, గంభీర్, యువరాజ్ ఇప్పటికే రిటైర్ అయ్యారు. రోహిత్ మాత్రం ఓపెనర్గా దుమ్ముదులుపుతున్నాడు. 2007 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాపై హాఫ్ సెంచరీ చేసిన అతడు ఫైనల్లో పాకిస్థాన్పై విలువైన 30 పరుగులు చేశాడు. ఇప్పుడు మరోసారి పాక్ను చిత్తు చేయాలంటే హిట్ మ్యాన్ చెలరేగడం చాలా అవసరం. కాగా పాకిస్థాన్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మకే ఎక్కువ అభిమానులు ఉన్నారంట. అందుకే రోహిత్ను పాకిస్థాన్ అభిమానులు ఇండియాకా ఇంజమామ్ అని ముద్దుగా పిలుస్తారంట.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!