Ramayan: శ్రీ రామునికి ఓ సోదరి ఉందన్న విషయం మీకు తెలుసా?. నేటికీ హిమాచల్ ప్రదేశ్ లో ఆలయం
- హిందువుల పవిత్ర గ్రంథాలలో రామాయణం ఒకటి
- రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణమే ప్రామాణికం
- వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు
- అలాంటి గాథే రాములవారి అక్క గురించిన కథ
- దశరథ రాజు.. కౌసల్యకు శాంత అనే పేరుగల కుమార్తె
రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటిగా భావించే ఇతిహాసం. రాముడిని ఆదర్శపురుషుడిగా కొలుస్తారు. చిన్నప్పటి నుంచి వింటున్న రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, భరతుడు, దశరథుడు, కౌసల్య, శబరి ఇలా ఎన్నో పాత్రల గురించి తెలిసే ఉంటుంది. చాలా మందికి తెలియని మరోపాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. మనం తరచూ వినే ‘లక్ష్మణరేఖ’ వంటి ఘట్టాలు మూల రామాయణంలో లేవని చెబుతుంటారు. అలాంటి మరో గాథే రాములవారి అక్క గురించిన కథ!
READ MORE: Gally Gang Stars: ఎట్టకేలకు థియేటర్స్లో సందడి చేయబోతున్న ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’..
Also Read
శ్రీ రాముడు దశరథ రాజు, కౌసల్య కుమారుడు. కానీ రామునితోపాటు దశరథుడు కౌసల్యకు ఒక కుమార్తె ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రామాయణ ఇతిహాసంలో రాముడి సోదరి ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. రాముడికి శాంత అనే సోదరి ఉంది. ఆమె నలుగురు సోదరుల కంటే పెద్దది. ఆమె దశరథ రాజు మరియు కౌసల్య దేవి కుమార్తె. శాంత చాలా తెలివైనది.. అలాగే వేదాలు, కళలు మరియు చేతివృత్తులలో ప్రావీణ్యం సంపాదించింది. అంతేకాకుండా.. ఆమె కూడా చాలా అందంగా ఉండేది. ఆమెను దత్తత ఇచ్చినట్లు నమ్ముతారు. ఇది రామాయణంలో కూడా కనిపిస్తుంది.
READ MORE:Delhi: ఢిల్లీలో కూలిన ఆస్పత్రి భవనం.. ఒకరి మృతి
శాంత గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి అంగదేశ రాజు రోంపద్ తన భార్య రాణి వర్షిణితో కలిసి అయోధ్యకు వచ్చాడని చెబుతారు. వర్షిణి కౌసల్య సోదరి. వారిద్దరికీ పిల్లలు లేకపోవడంతో చాలా బాధపడే వారు. ఈ విషయం దశరథ రాజుకు తెలియడంతో.. అతను తన కుమార్తె శాంతను దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దశరథ రాజు ఈ మాటలు విన్న రోమపాద మరియు వర్షిణి చాలా సంతోషించారు. దత్తత తీసుకున్న తర్వాత ఆమె శాంతను ఎంతో ప్రేమతో పెంచింది. శాంత అంగ దేశానికి యువరాణి అయింది.
READ MORE: BJP MP Nishikant Dubey: ఆ ప్రాంతాలను యూటీగా చేయడం లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు..
శ్రీరాముని అక్క శాంత శృంగ మహర్షిని వివాహం చేసుకుంది. దీని వెనుక ఒక కథ ఉంది. ఒక రోజు రాజు రోంపాడ్ తన కుమార్తె శాంతతో మాట్లాడుతుండగా.. ఓ బ్రాహ్మణుడు అతని ఇంటి వద్దకు వచ్చి పొలాలను దున్నడంలో రాజ దర్బారు నుంచి కొంత సహాయం కోరాడు. కానీ రాజు తన కుమార్తె శాంతతో మాట్లాడటంలో చాలా బిజీగా ఉన్నాడు. అతను బ్రాహ్మణుడు చెప్పినదానిని పట్టించుకోలేదు. దీంతో అతడు నిరాశతో వెనుదిరిగాడు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రదేవుని భక్తుడు, అతని స్థితిని చూసి ఇంద్రదేవుడు కోపించి అంగదేశంలో వర్షం పడకుండా చేశాడు. దీంతో రాష్ట్రంలో కరువు నెలకొంది. అప్పుడు రాజు శృంగ మహర్షిని పిలిచి వర్షం కురిపించడానికి యజ్ఞం చేయిస్తాడు. యాగం ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. అప్పుడు రాజు సంతోషించి తన కుమార్తె శాంతను శృంగ మహర్షికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు.
READ MORE:Team India: ప్రపంచకప్ గెలవడంతో జెర్సీలో కీలక మార్పు..
కులు లోని దేవీ శాంత ఆలయం
నేటికీ హిమాచల్ ప్రదేశ్ లోని కులులోని శృంగ రుషి ఆలయంలో శ్రీరాముని అక్క శాంతాదేవిని పూజిస్తారు. ఈ ఆలయం కులు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ శాంతా దేవి విగ్రహం ఉంది. శాంత దేవిని, ఆమె భర్త శృంగను కలిసి పూజిస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. దసరా పండుగ సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!