Team India: ప్రపంచకప్ గెలవడంతో జెర్సీలో కీలక మార్పు..
- జూలై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం
- సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జెర్సీలో భారీ మార్పు
- కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చిన భారత ఆటగాళ్లు
- రెండు స్టార్లతో కూడిన జెర్సీ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్లోని మూడు మ్యాచ్లు పల్లెకెలెలో జరగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జెర్సీలో భారీ మార్పు జరిగింది. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న టీమిండియా.. నెట్స్ ప్రాక్టీస్లో దూకుడు పెంచారు. సూర్యకుమార్ యాదవ్ బృందం ఆతిథ్య జట్టుతో తలపడనుంది. సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉందనగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు.
Hasini Sudhir: రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీ.. “పురుషోత్తముడు” హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
పేసర్లు మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్లు రెండు స్టార్లతో కూడిన జెర్సీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ జెర్సీపై రెండు నక్షత్రాలు ఉన్నాయి. మొన్న గెలిచిన వరల్డ్ కప్ ట్రోఫీతో మరో స్టార్ జెర్సీపై ముద్రించారు. ఇంతకుముందు ఒక వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొందగా.. తాజాగా కరేబియన్ గడ్డపై సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ సాధించింది టీమిండియా. ఈ క్రమంలో.. రెండు విజయాలకు గుర్తుగా మరో స్టార్ ను జెర్సీపై యాడ్ చేశారు. లంకేయులతో జరుగనున్న టీ20 సిరీస్లో టీమిండియా టూ స్టార్ జెర్సీని ధరించి బరిలోకి దిగనుంది. కాగా.. ఇంతకముందు ఎంఎస్ ధోని సారథ్యంలో 2007లో భారత్ ఛాంపియన్ అవతరించింది. అప్పుడు జెర్సీపై ఒక స్టార్ ఉంది. తాజాగా రోహిత్ సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ గెలుపొందగా మరో స్టార్ను ముద్రించారు. అయితే.. ఈ స్టార్ ను తెచ్చిపెట్టిన రోహిత్, విరాట్ కోహ్లీ ఈ జెర్సీలు ధరించలేరు. ఎందుకంటే.. వారు టీ20 వరల్డ్ కప్ గెలవగానే టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
UPSC Changes Exam Pattern: ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ పరీక్షా విధానంలో కీలక మార్పులు..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!