BJP MP Nishikant Dubey: ఆ ప్రాంతాలను యూటీగా చేయడం లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు..
- బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్లోకి అక్రమ వలసలు..
- జార్ఖండ్ సంతాల్లో 10 శాతం తగ్గిన గిరిజన జనాభా..
- గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుంటున్న ముస్లింలు..
- త్వరలోనే ఆ ప్రాంతంలో హిందువులు కనుమరుగు..
- నూతన కేంద్రపాలిత ప్రాంతం కోసం బీజేపీ ఎంపీ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Nishikant Dubey: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్లో 10 శాతం గిరిజన జనాభా తగ్గిందని, వారంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాల్దా, ముర్షిదాబాద్, అరారియా, కిషన్గంజ్, కతిహార్ మరియు సంతాల్ పరగణాస్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని, లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు” అని, ఈ ప్రాంతాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్ ముస్లింలు ఈ ప్రాంతాల్లోకి చొరబడి, జిల్లా పరిషత్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుంటున్నారని దూబే పేర్కొన్నారు. మహిళ గిరిజనురాలైతే, ఆమె భర్త ముస్లిం అని, ఇలా రాష్ట్రంలో కనీసం 100 మంది గ్రామపెద్దలు ముస్లింలుగా ఉన్నారని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు జార్ఖండ్లోకి ప్రవేశించి హిందూ జనాభాను తరిమేస్తున్నారని, సంతాల్ పరగణా ప్రాంతంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిందని చెప్పారు.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
Read Also: Rajasthan: రాజస్థాన్లో దారుణం.. మహిళపై మామ అఘాయిత్యం.. బాధితురాలు ఆత్మహత్య
సంతాల్ పరగణా నుంచే తాను వచ్చానని, బీహార్ నుంచి సంతాల్ పరగణా విడిపోయి జార్ఖండ్లో భాగమైన 2000లో ఇక్కడ 36 శాతం గిరిజనులు ఉండగా, ఇప్పడు వారి జనాభా 26 శాతానికి చేరింది, మిగతా 10 శాతం గిరిజనులు మాయమైపోయారా..? అంటూ ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోని జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడం లేదని, బంగ్లాదేశ్ నుంచి తమ రాష్ట్రంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని అన్నారు. తన వాదన తప్పని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
పాకుర్లోని తారానగర్-ఇలామి, దగాపరాలో అల్లర్లు చెలరేగాయి. ఎందుకంటే మాల్దా, ముర్షిదాబాద్ ప్రజలు మా ప్రజలను తరిమికొడుతున్నారని, హిందూ గ్రామాలు ఖాళీ అవుతున్నాయని, ఇది తీవ్రమైన విషయమని అన్నారు. తాను రికార్డులో ఉన్నవే చెబుతున్నానని చెప్పారు. జార్ఖండ్ పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని, కిషన్ గంజ్, అరారియా, కతిహార్, మాల్దా, ముర్షిదాబాద్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయాలని, లేకుంటే హిందువులు కనుమరుగు అవుతారని చెప్పారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!