BJP MP Nishikant Dubey: ఆ ప్రాంతాలను యూటీగా చేయడం లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు..
- బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్లోకి అక్రమ వలసలు..
- జార్ఖండ్ సంతాల్లో 10 శాతం తగ్గిన గిరిజన జనాభా..
- గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుంటున్న ముస్లింలు..
- త్వరలోనే ఆ ప్రాంతంలో హిందువులు కనుమరుగు..
- నూతన కేంద్రపాలిత ప్రాంతం కోసం బీజేపీ ఎంపీ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Nishikant Dubey: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్లో 10 శాతం గిరిజన జనాభా తగ్గిందని, వారంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాల్దా, ముర్షిదాబాద్, అరారియా, కిషన్గంజ్, కతిహార్ మరియు సంతాల్ పరగణాస్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని, లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు” అని, ఈ ప్రాంతాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్ ముస్లింలు ఈ ప్రాంతాల్లోకి చొరబడి, జిల్లా పరిషత్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుంటున్నారని దూబే పేర్కొన్నారు. మహిళ గిరిజనురాలైతే, ఆమె భర్త ముస్లిం అని, ఇలా రాష్ట్రంలో కనీసం 100 మంది గ్రామపెద్దలు ముస్లింలుగా ఉన్నారని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు జార్ఖండ్లోకి ప్రవేశించి హిందూ జనాభాను తరిమేస్తున్నారని, సంతాల్ పరగణా ప్రాంతంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిందని చెప్పారు.
Also Read
Read Also: Rajasthan: రాజస్థాన్లో దారుణం.. మహిళపై మామ అఘాయిత్యం.. బాధితురాలు ఆత్మహత్య
సంతాల్ పరగణా నుంచే తాను వచ్చానని, బీహార్ నుంచి సంతాల్ పరగణా విడిపోయి జార్ఖండ్లో భాగమైన 2000లో ఇక్కడ 36 శాతం గిరిజనులు ఉండగా, ఇప్పడు వారి జనాభా 26 శాతానికి చేరింది, మిగతా 10 శాతం గిరిజనులు మాయమైపోయారా..? అంటూ ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోని జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడం లేదని, బంగ్లాదేశ్ నుంచి తమ రాష్ట్రంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని అన్నారు. తన వాదన తప్పని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
పాకుర్లోని తారానగర్-ఇలామి, దగాపరాలో అల్లర్లు చెలరేగాయి. ఎందుకంటే మాల్దా, ముర్షిదాబాద్ ప్రజలు మా ప్రజలను తరిమికొడుతున్నారని, హిందూ గ్రామాలు ఖాళీ అవుతున్నాయని, ఇది తీవ్రమైన విషయమని అన్నారు. తాను రికార్డులో ఉన్నవే చెబుతున్నానని చెప్పారు. జార్ఖండ్ పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని, కిషన్ గంజ్, అరారియా, కతిహార్, మాల్దా, ముర్షిదాబాద్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయాలని, లేకుంటే హిందువులు కనుమరుగు అవుతారని చెప్పారు.
తాజావార్తలు
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే?
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!