Congress: రెండో రోజు కాంగ్రెస్ ఆందోళన.. నల్ల దుస్తులు ధరించి నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై అనర్హాత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా సోమవారం వరుసగా రెండో రోజు కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ సీనియర్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాహుల్గాంధీపై పార్లమెంట్కు అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆదివారం రాజ్ఘాట్లో జరిగిన నిరసన తర్వాత ఈరోజు వరుసగా రెండో రోజు ఆందోళన వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ సీనియర్ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు.
Also Read: NTR 30: ఎన్టీఆర్ తో మొదలయ్యింది… ఎన్టీఆర్ తోనే ముగుస్తుందా?
Also Read
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
అంతకుముందు సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే కార్యాలయంలో తృణమూల్ నేషనల్ కాంగ్రెస్తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు సమావేశమై పార్లమెంటు సమావేశానికి ముందు తమ వ్యూహంపై చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్లు రెండూ ఒకే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ టీఎంసీ ఇప్పటివరకు కాంగ్రెస్ నిరసనలకు దూరంగా ఉంది. ఆ తర్వాత పార్లమెంట్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. లోక్సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
Also Read:వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!
ఆదివారం రాజ్ ఘాట్ వద్ద జరిగిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’లో కాంగ్రెస్ సీనియర్ నేతలు పి చిదంబరం, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం నాడు బిజెపి ద్వంద్వ ప్రమాణాలపై తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!