రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఐపీఎల్ 2026 సీజన్కు ముందే ఒక అద్భుతమైన వార్త అందింది. గత కొంతకాలంగా వేదికల విషయంలో ఉన్న సస్పెన్స్కు తెరదించుతూ, జట్టు యాజమాన్యం తమ హోమ్ మ్యాచ్ల వివరాలను అధికారికంగా వెల్లడించింది. గతంలో జరిగిన ఒక విషాదకరమైన తొక్కిసలాట ఘటన తర్వాత, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, జస్టిస్ కున్హా కమిటీ సిఫార్సుల మేరకు స్టేడియంలో భారీ మార్పులు చేపట్టారు. వెంకటేష్ ప్రసాద్ నేతృత్వంలోని KSCA (కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్) స్టేడియం పునరుద్ధరణ పనులను పూర్తి చేసి, అవసరమైన అన్ని అనుమతులను పొందింది.
హోమ్ మ్యాచ్ల వేదికలు ఇలా.. ఆర్సీబీ తన మొత్తం ఏడు హోమ్ మ్యాచ్లలో.. 5 మ్యాచ్లను బెంగళూరులోని తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. 2 మ్యాచ్లను ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ (షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం) లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని ఆర్సిబి సీఈఓ రాజేష్ మీనన్ ధృవీకరించారు. కర్ణాటక ప్రభుత్వం మరియు పోలీసు శాఖ అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ముంబై ఇండియన్స్ నుంచి నో (NOC)!
మధ్యలో ఆర్సిబి తన మ్యాచ్లను నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియానికి మార్చాలని ప్రయత్నించింది. ఇందుకోసం ముంబై ఇండియన్స్ (MI) యాజమాన్యం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోరింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ముంబై ఇండియన్స్ ఇందుకు నిరాకరించడంతో, ఆర్సిబి తిరిగి బెంగళూరు మరియు రాయ్పూర్ వేదికలనే ఖరారు చేసుకుంది. మొత్తంగా 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్గా నిలిచిన ఆర్సిబి, ఇప్పుడు తమ సొంత గడ్డపై మళ్ళీ అడుగుపెడుతుండటం ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగనున్న ఈ మ్యాచ్లు క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేయనున్నాయి.