Bilkis Bano Case: బీజేపీ ఎంపీతో వేదిక పంచుకున్న రేపిస్ట్.. భారతదేశం చూస్తోందన్న కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు శనివారం గుజరాత్ లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదిక పంచుకున్నారు. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
బిల్కిస్ బానో రేప్ కేసులో దోషి అయిన శైలేష్ భట్, దాహోద్ బిజెపి ఎంపి జస్వంత్సిన్హ్ భాభోర్ , లింఖెడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్తో పాటు గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దీనినై కవిత ట్వీట్ చేస్తూ, “బిల్కిస్ బానో రేపిస్ట్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకుంటాడు. మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటూ సంబరాలు చేసుకుంటున్న సమాజంగా మనం ఏమైపోయాం. భారతదేశం చూస్తోంది!” అంటూ పేర్కొన్నారు.
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
Bilkis Bano Rapist openly shares stage with BJP’s MPs and MLAs.
What have we become as a community that perpetrators of heinous crimes against women are being celebrated and given a platform while the victims plead for justice.
India is watching! https://t.co/D90SiH84fC
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 27, 2023
అదేవిధంగా, టీఎంసీ ఎంపీ మోయిత్రా స్పందిస్తూ.. “బిల్కిస్ బానో యొక్క రేపిస్ట్ గుజరాత్లోని బిజెపి ఎంపి, ఎమ్మెల్యేతో వేదికను పంచుకున్నాడు. నేను ఈ రాక్షసులను తిరిగి జైలులో చూడాలనుకుంటున్నాను. తాళం చెవి విసిరేయాలి. న్యాయం యొక్క ఈ అపహాస్యాన్ని ప్రశంసించే ఈ సాతాను ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం తన నైతిక దిక్సూచిని తిరిగి పొందాలని నేను కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.
Bilkis Bano's Rapist Shares Stage With Gujarat's BJP MP, MLA.
I want to see these monsters back in jail & the key thrown away. And I want this satanic government that applauds this travesty of justice voted out. I want India to reclaim her moral compass. pic.twitter.com/noaoz1c7ZW
— Mahua Moitra (@MahuaMoitra) March 26, 2023
బిల్కిస్ బానో రేప్ కేసులో దోషి అయిన శైలేష్ భట్ పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎమ్మెల్యే జస్వంత్సింగ్ భాభోర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దహోద్ జిల్లాలోని లిమ్ఖేడా తాలూకా వద్ద, కడనా డ్యామ్ బల్క్ పైప్లైన్ ఆధారిత లిమ్ఖేడా గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్కు 101.89 కోట్ల అంచనాల కింద శంకుస్థాపన చేశారు. లింఖేడా తాలూకాలోని 43 గ్రామాలు, సింగ్వాడ్ తాలూకాలోని 18 గ్రామాలు, ఝలోద్ తాలూకాలోని 3 గ్రామాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతాయి. కాగా, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఒకే కుటుంబంలోని ఏడుగురిని హతమార్చిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషుల శిక్షను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
Also Read:Doctors Protest : పానీపూరీలు అమ్ముకుంటున్న డాక్టర్..
తాజావార్తలు
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!