Bilkis Bano Case: బీజేపీ ఎంపీతో వేదిక పంచుకున్న రేపిస్ట్.. భారతదేశం చూస్తోందన్న కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు శనివారం గుజరాత్ లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదిక పంచుకున్నారు. ఈ విషయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
బిల్కిస్ బానో రేప్ కేసులో దోషి అయిన శైలేష్ భట్, దాహోద్ బిజెపి ఎంపి జస్వంత్సిన్హ్ భాభోర్ , లింఖెడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్తో పాటు గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దీనినై కవిత ట్వీట్ చేస్తూ, “బిల్కిస్ బానో రేపిస్ట్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకుంటాడు. మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటూ సంబరాలు చేసుకుంటున్న సమాజంగా మనం ఏమైపోయాం. భారతదేశం చూస్తోంది!” అంటూ పేర్కొన్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
Bilkis Bano Rapist openly shares stage with BJP’s MPs and MLAs.
What have we become as a community that perpetrators of heinous crimes against women are being celebrated and given a platform while the victims plead for justice.
India is watching! https://t.co/D90SiH84fC
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 27, 2023
అదేవిధంగా, టీఎంసీ ఎంపీ మోయిత్రా స్పందిస్తూ.. “బిల్కిస్ బానో యొక్క రేపిస్ట్ గుజరాత్లోని బిజెపి ఎంపి, ఎమ్మెల్యేతో వేదికను పంచుకున్నాడు. నేను ఈ రాక్షసులను తిరిగి జైలులో చూడాలనుకుంటున్నాను. తాళం చెవి విసిరేయాలి. న్యాయం యొక్క ఈ అపహాస్యాన్ని ప్రశంసించే ఈ సాతాను ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం తన నైతిక దిక్సూచిని తిరిగి పొందాలని నేను కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.
Bilkis Bano's Rapist Shares Stage With Gujarat's BJP MP, MLA.
I want to see these monsters back in jail & the key thrown away. And I want this satanic government that applauds this travesty of justice voted out. I want India to reclaim her moral compass. pic.twitter.com/noaoz1c7ZW
— Mahua Moitra (@MahuaMoitra) March 26, 2023
బిల్కిస్ బానో రేప్ కేసులో దోషి అయిన శైలేష్ భట్ పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎమ్మెల్యే జస్వంత్సింగ్ భాభోర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దహోద్ జిల్లాలోని లిమ్ఖేడా తాలూకా వద్ద, కడనా డ్యామ్ బల్క్ పైప్లైన్ ఆధారిత లిమ్ఖేడా గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్కు 101.89 కోట్ల అంచనాల కింద శంకుస్థాపన చేశారు. లింఖేడా తాలూకాలోని 43 గ్రామాలు, సింగ్వాడ్ తాలూకాలోని 18 గ్రామాలు, ఝలోద్ తాలూకాలోని 3 గ్రామాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతాయి. కాగా, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఒకే కుటుంబంలోని ఏడుగురిని హతమార్చిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషుల శిక్షను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
Also Read:Doctors Protest : పానీపూరీలు అమ్ముకుంటున్న డాక్టర్..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..