Accused Of Gang Raping: అత్యాచారం కేసులో 21 మంది పోలీసులు.. నిర్దోషులుగా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యాచారం కేసులో ఏపీకి చెందిన కొందరు పోలీసులకు భారీ ఊరట లభించింది. వారిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల క్రితం 11 మంది గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 21 మంది పోలీసులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలో ఇద్దరు దర్యాప్తు అధికారులు విఫలమైనందున నిందితులను ప్రాథమికంగా నిర్దోషులుగా విడుదల చేసినట్లు కోర్టు పేర్కొంది.
Also Read:Andhra Pradesh: ఏపీలో అరుదైన మూలకాలు.. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్న శాస్త్రవేత్తలు..
Also Read
ఆగస్టు 2007లో గ్రేహౌండ్స్, ప్రత్యేక బృందానికి చెందిన పోలీసు సిబ్బంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 2018లో విశాఖపట్నంలో విచారణ ప్రారంభమైంది. ఎస్సీ,ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం కింద కేసు నమోదు కాగా.. పోలీసులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇదిలా ఉండగా, అత్యాచార ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) ద్వారా పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Also Read:Delhi Lodge Case: హనీ ట్రాప్ చేసి చంపేసింది.. ‘సారీ’ నోట్ పట్టించింది
హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF) సభ్యుడు తెలిపిన ప్రకారం, నిందితులు ఎవరూ అరెస్టు చేయబడలేదు. వారిలో కొందరు విజయవంతంగా పదవీ విరమణ చేయగా.. కొందరు మరణించారు. ఆగస్టు 2007లో గ్రేహౌండ్స్ బలగాలు 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం చేశాయని HRF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు M శరత్ అన్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేదు అని ఆరోపించారు. 2007 ఆగస్టు 20న 21 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక పోలీసు బృందం వాకపల్లి గ్రామానికి కూంబింగ్ ఆపరేషన్ల కోసం వెళ్లిందని, ముఖ్యంగా బలహీన గిరిజన వర్గానికి (PVTG) చెందిన 11 మంది గిరిజన మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫోరం ఆరోపించింది. వాకపల్లి అత్యాచార బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందంటే, వారి నివేదనలపై కోర్టు విశ్వాసం ఉంచిందని హెచ్ఆర్ఎఫ్ పేర్కొంది. పోలీసులపై విచారణ ప్రారంభంలోనే రాజీ పడింది మరియు వారిని రక్షించే ఉద్దేశ్యంతో జరిగిందని ఆరోపించింది.
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!