Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- యువతపై మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
- జెన్-జీతో దేశద్రోహులైపోతారా?
- నిరసనలో తప్పేముంది?
- రాజకీయ వర్గాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేపట్టిన ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక ఈ ఉద్యమంపై పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరిగాయి.

Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
తాజాగా ఇదే అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలు చేస్తున్నారనే కారణంతో జెన్-జీ (Gen Z) యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. వాళ్లంతా మన దేశ భవిష్యత్తు అని.. వాళ్లంతా మనవాళ్లేనని, వారి సమస్యలను వినడం, పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హితవు పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువత ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో ఒకటిగా పేర్కొంటున్న ‘ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ యూనైటింగ్ ది వరల్డ్, ది ఇండియన్ వే’ సదస్సులో మోహన్ భాగవత్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘జెన్ జీ యువత ఆందోళనలు చేస్తుంటే వారు దేశ వ్యతిరేకులు కారు. వారు మనవాళ్లే.. మన తర్వాతి తరం. వారు ఎందుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుని, వారి ఆందోళనలను పరిష్కరించాలి.’’ అని అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి కూడా కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయని సూచించారు. యువత అసలు నిరసనలు చేయకూడదని తాను చెప్పడం లేదని.. కానీ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి ఒక విధానం ఉంటుందని.. ఆ మార్గంలోనే తమ అభిప్రాయాలను వెల్లడించాలని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నిరసనల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ పరిణామాల మధ్య యువత ఆందోళనలపై మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!