Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- ప్రధాని మోడీకి నెతన్యాహు ఫోన్
- ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- కీలక ప్రకటన విడుదల చేసిన పీఎంవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం ఫోన్ చేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు భారత్-ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమగ్రంగా చర్చించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
పీఎంఓ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. భారత్-ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకార పురోగతిని మోడీ, నెతన్యాహు సమీక్షించారు. పరస్పర ప్రయోజనాల కోసం రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, ఆవిష్కరణలు, వాణిజ్యం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
అదే సమయంలో పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాంతీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ శాంతి, స్థిరత్వం కోసం పరస్పర సంప్రదింపులు కొనసాగించాలని వారు అభిప్రాయపడ్డారు. ఇకపై కూడా పరస్పరం నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోడీ, నెతన్యాహు అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!