Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jogulamba Gadwal Ys Sharmila Key Comments On Munugode By Election

Munugode By Election: మునుగోడు బరిలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ.. త్వరలో అభ్యర్థి ప్రకటన..!

Published Date :August 24, 2022 , 8:41 pm
By Sudhakar Ravula
Munugode By Election: మునుగోడు బరిలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ.. త్వరలో అభ్యర్థి ప్రకటన..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల చూపు మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీ నుంచి బరిలో దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.. పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా.. అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించింది లేదు.. మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆ సభ వేదికగానే అభ్యర్థి పేరు ప్రకటిస్తారని అంతా భావించినా.. అభ్యర్థి పేరు చెప్పకుండానే తన ప్రసంగాన్ని ముగించారు గులాబీ బాస్.. ఇప్పుడు మరోపార్టీ మునుగోడు బరిలో దిగేందుకు సిద్ధమైంది.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ కూడా మునుగోడు ఉప ఎన్నికల బరిలో తన అభ్యర్థిని పెట్టేందుకు రెడీ అయినట్టు.. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి..

Read Also: Komatireddy Venkat Reddy: ప్రియాంకా గాంధీతో భేటీ.. ఆ అంశంపై చర్చించాం

వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 131వ రోజుకు చేరింది.. యాత్రలో భాగంగా 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు.. ఆ సభలో వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్ భయపడి వంగి వంగి దండలు పెడుతున్నాడు.. నన్ను ఆగం చేయకండి అని వేడుకుంటున్నారు.. ఒక ఉప ఎన్నికకే కేసీఆర్‌ వణికిపోతున్నారు.. అసలు ప్రజల్లో ఏ ఆదరణ లేని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బరిలో ఉన్నాయంటేనే కేసీఆర్‌ ఇంత ఆగం అవుతున్నారంటే.. ఇక, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ బరిలో ఉండబోతోంది అంటే.. కేసీఆర్‌ కన్నీళ్లు పెట్టుకుంటారో..? మునుగోడు ప్రజల కాళ్లు పట్టి వేడుకుంటారా? చూడాలని వ్యాఖ్యానించారు. దీంతో, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తుందనే చర్చ సాగుతోంది.

ఇక, అలంపూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాని ముఖ్యమంత్రి గాని ఏం చేశారు అని నిలదీశారు వైఎస్‌ షర్మిల.. అలంపూరు దళిత ఎమ్మెల్యే.. దళితులకు ఏమైనా మేలు చేశాడా.. మొత్తం కర్నూల్ లొనే ఎక్కువగా ఉంటాడు.. దళిత బంధుకు కూడా కమీషన్లు తీసుకుంటాడంట కదా..? అని ఫైర్‌ అయ్యారు. ఇసుక మాఫియా అడ్డం పెట్టుకొని కొడుకు దోచుకుంటున్నాడు.. ఎమ్మెల్యే పేరు దళిత బంధు అంట.. కొడుకు పేరు ఏమో ఇసుక మాఫియా బంధు అని.. ఇద్దరికీ కలిపి ఉన్న పేరు కమీషన్ల బంధు అని.. ఎమ్మెల్యే అబ్రహం, ఆయన తనయుడు పై విరుచుకుపడ్డారు వైఎస్‌ షర్మిల.. అలంపూరులో బస్సు డిపో నిర్మిస్తామన్నాడు. శక్తి పీఠానికి 100 కోట్లు కేటాయిస్తామన్నాడు.. అలంపూరు నియోజకవర్గానికి కేసీఆర్‌ ఏమైనా చేశాడా? అని ప్రశ్నించారు..

మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత.. పేద మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి వారి కాల మీద నిలబడేటట్లు చేసిన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనని స్పష్టం చేశారు షర్మిల.. పేద వాడు ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే అందుబాటులో 108 పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన మహనీయుడు వైస్సార్.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన రికార్డ్ ముఖ్యమంత్రి వైయస్సార్ అన్నారు. కానీ, కేజీ టూ పీజీ అన్నాడు.. ప్రతి నిరుద్యోగికి 3000 అన్నాడు, డబుల్ బెడ్ రూమ్ అన్నాడుచ 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు.. 8 సంవత్సరాలుగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్‌ అంటూ ఫైర్‌ అయ్యారు.. ఆర్డీఎస్ కొరకు ఈ ప్రాంత సాగు నీటి కష్టాలు తీర్చాలని అప్పట్లో అడిగిన వెంటనే వైస్సార్ 101 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు.. అయితే, రైతు బంధు 5000 వేసి రైతులను లక్షాధికారులను చేస్తా అన్నాడు.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్టాన్ని కేసీఆర్‌ చేతిలో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకే బంగారు తెలంగాణ.. బీర్ల తెలంగాణ.. బార్ల తెలంగాణ.. కేసీఆర్‌ కుటుంబానికి బంగారు తెలంగాణ అని మండిపడ్డారు వైఎస్‌ షర్మిల.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • munugode
  • Munugode By Election
  • telangana
  • YS Sharmila
  • YSR Telangana Party

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Fake Holi Links: హోలీ పేరుతో లింక్స్.. ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • Varanasi : స్పిరిట్, రామాయణ రిలీజ్ ప్లానింగ్‌పై రాజమౌళి అసంతృప్తి

  • Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..

  • CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions