Komatireddy Venkat Reddy: ప్రియాంకా గాంధీతో భేటీ.. ఆ అంశంపై చర్చించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy Talks About Priyanka Gandhi Meeting: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలన్న అంశంపై ఆమెతో చర్చించానని చెప్పారు. ఒక ఫంక్షన్ కారణంగా మొన్న నిర్వహించిన సమావేశానికి తాను హాజరు కాలేకపోయానని ఆమెకు వివరించానన్నారు. ఇప్పుడు తన కోసం ప్రత్యేకంగా సమయం ఇచ్చి, చాలా విషయాలు సుదీర్ఘంగా చర్చించారన్నారు. ఈ చర్చలో భాగంగా తాను కొన్ని సలహాలు ఇచ్చానని, ఆమె కూడా టీమ్ వర్క్తో నేతలందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారన్నారు. ఏ సమస్య ఉన్నా, తన దగ్గరకు రమ్మని ప్రియాంకా గాంధీ చెప్పారన్నారు. ప్రస్తుతం తాను 10 రోజుల పాటు అందుబాటులో ఉండనని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోనే ఉంటానని ఆమె తెలిపారన్నారు. భారత్ జోడో యాత్ర సహా రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా ఈ భేటీలో అర్థవంతంగా చర్చ జరిగిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కాగా.. ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ సమావేశం తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చాక కాంగ్రెస్ పార్టీ తీరుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! 30 సంవత్సరాలుగా పార్టీలో పని చేస్తున్నప్పటికీ.. పార్టీ తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని సర్వనాశనం చేసి, పార్టీని నమ్ముకున్న తనలాంటి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. అలాగే.. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో ప్రియాంక నిర్వహించిన భేటీకి కూడా డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి గుడ్బై చెప్పొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ప్రియాంకా గాంధీ భేటీ అనంతరం ఆ అనుమానాలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. మొన్న సమావేశానికి డుమ్మా కొట్టడంతో, స్వయంగా ప్రియాంకా గాంధీనే తనతో భేటీకి రావాలంటూ కబురు పంపారు.
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
తాజావార్తలు
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..