Mahesh Goud: చంద్రబాబుతో చెట్టాపట్టాల్ వేసుకుని బనకచర్లకు ఒప్పుకుంది మీరు కాదా..?
- కవితకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్..
- బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో ఎందుకు గెలుస్తుంది?..
- చంద్రబాబుతో చెట్టాపట్టాల్ వేసుకుని బనకచర్లకు ఒప్పుకుంది మీరు కాదా?..
- బీఆర్ఎస్ స్కామ్స్ చేసింది, కాంగ్రెస్ బీసీల ఛాంపియన్: మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Goud: సుదీర్ఘ కాలం పాటు రాజకీయ చరిత్ర కలిగిన ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు అని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మండల, జిల్లా అధ్యక్షులతో సమావేశమవుతారు.. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అందరికి సమన్యాయం చేస్తారు.. రేపటి ఖర్గే సభకి సామాజిక న్యాయ సమరా భేరి సమావేశంగా పేరు పెట్టామని చెప్పుకొచ్చారు. జైబాపు, జైభీం, జైసంవిధాన్ కార్యక్రమాన్ని ఆరు నెలలుగా విజయవంతంగా కొనసాగుతోంది అన్నారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో జరిగే పీఏసీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారు.. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో కార్యకర్తలతో భేటీ అవుతారని మహేష్ గౌడ్ వెల్లడించారు.
Read Also: F-35B Fighter: కేరళలో చిక్కుకున్న ఎఫ్-35ని భారీ విమానంలో తరలించే అవకాశం..
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా లెటర్ రాసిందా, జాగృతి నాయకురాలుగా రాసిందా అని ప్రశ్నించారు. మేము బీసీల కోసం వాగ్దానం చేసిన రోజు కవిత తీహార్ జైల్లో ఊసలు లెక్కపెడుతుంది అని ఎద్దేవా చేశారు. కవిత జైల్లో ఉండి ఊసలు లెక్కపెడుతూ బీసీల కోసం ఉద్యమం చేసిందా.. గొర్లు, బర్ల పేరుతో స్కామ్స్ చేసి దండుకుంది మీ ఫ్యామిలీ కాదా? అని ఆరోపించారు. రాజకీయ శూన్యంలో ఉన్న కవిత మనుగడకోసం మాట్లాడుతుంది.. ఏమి చేశారని లోకల్ బాడీలో బీఆర్ఎస్ 80 శాతం గెలుస్తుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఎందుకు ఓట్లు వేస్తారు అని అడిగారు. రాష్ట్ర సంపద దోచుకున్నారని మీకు ఓట్లు వేస్తారా?.. బీసీల విషయంలో కాంగ్రెస్ ఛాంపియన్ అని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Read Also: Diogo Jota: విషాదం.. కారు ప్రమాదంలో ఫుట్బాల్ క్రీడాకారుడు దుర్మరణం
ఇక, బీజేపీలో సమర్థవంతమైన బీసీ నాయకుడు లేడా? అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రశ్నించాడు. రామచందర్ రావుని అధ్యక్షుడిని చేశారు.. బీసీల విషయంలో చిత్త శుద్ధి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్.. హరీష్ రావు అన్నట్లు అసెంబ్లీలో చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.. హరీష్ రావుకు దమ్ముందా? అని అడిగారు. అలాగే, చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని బనకచర్ల ప్రాజెక్టుపై ఒప్పుకుంది మీరు కాదా? అని అడిగారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్టేట్మెంట్ పై తీవ్రంగా పరిగణిస్తున్నాం.. పార్టీలో అందరూ క్రమ శిక్షణతో ఉండాలి.. లేకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..