Mahesh Goud: చంద్రబాబుతో చెట్టాపట్టాల్ వేసుకుని బనకచర్లకు ఒప్పుకుంది మీరు కాదా..?
- కవితకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్..
- బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో ఎందుకు గెలుస్తుంది?..
- చంద్రబాబుతో చెట్టాపట్టాల్ వేసుకుని బనకచర్లకు ఒప్పుకుంది మీరు కాదా?..
- బీఆర్ఎస్ స్కామ్స్ చేసింది, కాంగ్రెస్ బీసీల ఛాంపియన్: మహేష్ గౌడ్
Mahesh Goud: సుదీర్ఘ కాలం పాటు రాజకీయ చరిత్ర కలిగిన ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు అని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మండల, జిల్లా అధ్యక్షులతో సమావేశమవుతారు.. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అందరికి సమన్యాయం చేస్తారు.. రేపటి ఖర్గే సభకి సామాజిక న్యాయ సమరా భేరి సమావేశంగా పేరు పెట్టామని చెప్పుకొచ్చారు. జైబాపు, జైభీం, జైసంవిధాన్ కార్యక్రమాన్ని ఆరు నెలలుగా విజయవంతంగా కొనసాగుతోంది అన్నారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో జరిగే పీఏసీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారు.. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో కార్యకర్తలతో భేటీ అవుతారని మహేష్ గౌడ్ వెల్లడించారు.
Read Also: F-35B Fighter: కేరళలో చిక్కుకున్న ఎఫ్-35ని భారీ విమానంలో తరలించే అవకాశం..
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా లెటర్ రాసిందా, జాగృతి నాయకురాలుగా రాసిందా అని ప్రశ్నించారు. మేము బీసీల కోసం వాగ్దానం చేసిన రోజు కవిత తీహార్ జైల్లో ఊసలు లెక్కపెడుతుంది అని ఎద్దేవా చేశారు. కవిత జైల్లో ఉండి ఊసలు లెక్కపెడుతూ బీసీల కోసం ఉద్యమం చేసిందా.. గొర్లు, బర్ల పేరుతో స్కామ్స్ చేసి దండుకుంది మీ ఫ్యామిలీ కాదా? అని ఆరోపించారు. రాజకీయ శూన్యంలో ఉన్న కవిత మనుగడకోసం మాట్లాడుతుంది.. ఏమి చేశారని లోకల్ బాడీలో బీఆర్ఎస్ 80 శాతం గెలుస్తుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఎందుకు ఓట్లు వేస్తారు అని అడిగారు. రాష్ట్ర సంపద దోచుకున్నారని మీకు ఓట్లు వేస్తారా?.. బీసీల విషయంలో కాంగ్రెస్ ఛాంపియన్ అని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Read Also: Diogo Jota: విషాదం.. కారు ప్రమాదంలో ఫుట్బాల్ క్రీడాకారుడు దుర్మరణం
ఇక, బీజేపీలో సమర్థవంతమైన బీసీ నాయకుడు లేడా? అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రశ్నించాడు. రామచందర్ రావుని అధ్యక్షుడిని చేశారు.. బీసీల విషయంలో చిత్త శుద్ధి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్.. హరీష్ రావు అన్నట్లు అసెంబ్లీలో చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు.. హరీష్ రావుకు దమ్ముందా? అని అడిగారు. అలాగే, చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని బనకచర్ల ప్రాజెక్టుపై ఒప్పుకుంది మీరు కాదా? అని అడిగారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్టేట్మెంట్ పై తీవ్రంగా పరిగణిస్తున్నాం.. పార్టీలో అందరూ క్రమ శిక్షణతో ఉండాలి.. లేకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!