T Congress: యశ్వంత్ సిన్హా పర్యటనతో మరోసారి బయటపడిన విభేదాలు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. యశ్వంత్ పర్యటనను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా యశ్వంత్కు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు జరిగిన ర్యాలీలో సిన్హాతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ అధిష్టానం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. యశ్వంత్ నామినేషన్కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ను కలిసిన తర్వాత తాము ఎట్టి పరిస్థితుల్లోనూ యశ్వంత్ సిన్హాను కలిసే ప్రశ్నే లేదని రాహుల్కు తేల్చి చెప్పినట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించడం గమనార్హం.
BJP National Executive Meeting: 2014 కన్నా ముందే తెలంగాణ వచ్చేదా?
Also Read
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
ఇదిలా వుండగా యశ్వంత్ సిన్హాను టీపీసీసీ తరపున ఆహ్వానించి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యశ్వంత్ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండాలని టీపీసీసీ నిర్ణయించుకుంది. హైదరాబాద్లో తాము యశ్వంత్ను కలవబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన ఆదేశాలను ఆ పార్టీ నేతలు లెక్క చేయడం లేదు. ఇప్పటికే సీనియర్ నేత వి.హనుమంతరావు.. ఎయిర్ పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు.
మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. యశ్వంత్ను కలిసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరారు. సిన్హాకు కాంగ్రెస్ మద్దతిస్తున్నప్పుడు ఆయనను సీఎల్పీ పిలిస్తే బాగుండేదని అన్నారు. సిన్హాను కలవొద్దని ప్రకటించిన రేవంత్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను తప్పుపడుతూ జగ్గారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ కాంగ్రెస్ లో యశ్వంత్ పర్యటన ఏ పరిస్థితికి దారి తీస్తుందో చూడాలి. అవకాశం వచ్చినప్పుడల్లా తమలోని విభేదాలను బయటపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు వెనుకాడడం లేదని యశ్వంత్ పర్యటన నేపథ్యంలో నిరూపితమైంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో