Hyderabad: మద్యంలో విషం కలిపి భర్తతో తాగించింది.. ప్రియుడితో చెక్కేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: సాఫీగా సాగిపోతున్న జీవితాలను వివాహేతర సంబంధాలు నాశనం చేస్తున్నాయి. భార్యాభర్తల పవిత్ర బంధంపై అక్రమ సంబంధం పైచేయి సాధించిన ఘటనలు చాలానే ఉన్నాయి. బాయ్ఫ్రెండ్స్ కోసం భర్తను చంపేందుకు పిల్లలను వదిలించుకోవడానికి కొందరు మహిళలు ఎంతగా దిగజారేందుకు వెనుకాడటం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్య ప్రియుడి మోజులోపడి భర్తనే కడతేర్చింది. భార్యాభర్తల బంధానికి మచ్చలాంటి ఈ ఘటన హైదరాబాద్ శివారులో వెలుగు చూసింది.
Read also: Manipur: మణిపూర్ మహిళలతో అసభ్య ప్రవర్తన.. నిందితుడి ఇంటికి నిప్పు
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ లో కొత్తగొల్ల తుక్కప్ప, ఈశ్వరమ్మ దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. తుక్కప్ప కొంతకాలంగా పాక్షిక పక్షవాతంతో బాధపడుతూ మంచాన పడ్డాడు. దీంతో అతని భార్య ఈశ్వరమ్మ అదే కాలనీలో ఉంటున్న శ్రీనివాస్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలా కాలంగా కొనసాగుతున్న వీరి అక్రమ సంబంధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకాంతంగా వుండగా ఈశ్వరమ్మ, శ్రీనివాస్ లను రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. దీంతో తుక్కప్ప, ఈశ్వరమ్మ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈశ్వరమ్మకు తుక్కప్ప మరోసారి ఇలా జరిగితే బాగుండదని హెచ్చరించాడు. దీంతో ఈశ్వరమ్మ ఆగ్రహానికి లోనైంది. తుక్కప్పను హతమార్చాలని ప్రియుడితో ప్లాన్ వేసింది. అనారోగ్యంతో వున్న తుక్కప్పను మద్యంలో విషం కలిపి ఇచ్చింది.
Read also: Weight Loss Tips: ఈ వ్యాయామం వారానికి 2 రోజులు చేసినా చాలు.. ఇట్టే బరువు తగ్గుతారు!
అదిగమనించిని తుక్కప్ప మందును తాగి కిందకు పడిపోయాడు. దీంతో ఈశ్వరమ్మ ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారయ్యింది. తుక్కప్పను గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న తుక్కప్పను గుర్తించిన ఘట్ కేసర్ పోలీసులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. తుక్కప్ప మృతి చెందిన తర్వాత అతని భార్య ఈశ్వరమ్మ కనిపించకపోవడంతో ఈ పని చేసి ఉంటుందని అనుమానం బలపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిన్న(గురువారం) ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు శ్రీనివాస్లను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు ఘట్ కేసర్ పోలీసులు తెలిపారు.
Rangareddy: నవీన్ స్టోరీ మళ్లీ రిపీట్.. ప్రియురాలి కోసం స్నేహితున్ని చంపేశాడు
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!