తెలంగాణలో స్కూల్స్ రీ-ఓపెన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యా సంస్థల ప్రత్యక్ష తరగతులపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కొన్ని రాష్ట్రాలు ప్రత్యక్ష తరగతులకు సమాయత్తం అవుతున్నాయి. ఒకటి రెండు రాష్ట్రాల్లో పాక్షికంగా ప్రారంభమయ్యాయి కూడా. ఈ పరిస్ధితుల్లో… తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.గత రెండేళ్లుగా విద్యార్థులు తరగతి గది బోధనకు దూరం అయ్యారు. పాఠశాల విద్యార్థులయితే పరీక్షలు కూడా లేకుండానే పై తరగతులకు వెళ్లారు. డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నా.. ఎంత వరకు బుర్రకు ఎక్కుతున్నాయో తెలియని పరిస్థితి.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ఎంత మంది విద్యార్థులు స్కూలు మానేసారో క్లారిటీ లేదు. తెలంగాణ ప్రభుత్వం జులై ఒకటి నుంచి ఫిజికల్ క్లాసెస్ ప్రారంభించాలని అనుకున్నా కోవిడ్ కేసులు, థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారంతో వెనకడుగు వేసింది. ఆన్లైన్ ,డిజిటల్ తరగతులే నిర్వహించాలని ఆదేశించింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కోవిడ్ పరిస్థితుల పై చర్చించినా ప్రత్యక్ష తరగతుల పై మాత్రం నిర్ణయం తీసుకోలేదు… విద్యా శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం ఆదేశిస్తే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. మరోవైపు విద్యార్థులు ఇంకా ఇంటికే పరిమితమైతే ఎన్నో అనర్థాలు జరుగుతాయని మేధావులు అంటున్నారు. చిన్న పిల్లలకు కరోన ప్రభావం అంతగా ఉండక పోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఏదో ఒక విధంగా విద్యా సంస్థలు ప్రారంభించాలని సూచించింది.
బాల్య వివాహాలు జరుగుతున్నాయని, పిల్లలు చదువుకు దూరం ఆవుతున్నారని పేర్కొంది. తల్లి దండ్రులు, పిల్లలకి మధ్య సంబంధాలలో తేడా వస్తుందని రిపోర్ట్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . ప్రైవేట్ విద్యా సంస్థలూ కోరుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రారంభించాయని, మరికొన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అంటున్నాయి..ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకున్నా… ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుండి ప్రారంభించాలి, ఏ తరగతులకు ప్రారంభించాలి అనే దానిపై ఈ వారం లోనే డిసైడ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతుల పై ఇంటర్ బోర్డ్ ఇంకా నిర్ణయం తీసికోలేదు.. వెంటనే ఆన్లైన్ తరగతులు అయిన ప్రారంభించాలనే డిమాండ్ వస్తోంది.
తాజావార్తలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!