తెలంగాణలో స్కూల్స్ రీ-ఓపెన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యా సంస్థల ప్రత్యక్ష తరగతులపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కొన్ని రాష్ట్రాలు ప్రత్యక్ష తరగతులకు సమాయత్తం అవుతున్నాయి. ఒకటి రెండు రాష్ట్రాల్లో పాక్షికంగా ప్రారంభమయ్యాయి కూడా. ఈ పరిస్ధితుల్లో… తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.గత రెండేళ్లుగా విద్యార్థులు తరగతి గది బోధనకు దూరం అయ్యారు. పాఠశాల విద్యార్థులయితే పరీక్షలు కూడా లేకుండానే పై తరగతులకు వెళ్లారు. డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నా.. ఎంత వరకు బుర్రకు ఎక్కుతున్నాయో తెలియని పరిస్థితి.
Also Read
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
- Jagadish Reddy: కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం..
- Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
ఎంత మంది విద్యార్థులు స్కూలు మానేసారో క్లారిటీ లేదు. తెలంగాణ ప్రభుత్వం జులై ఒకటి నుంచి ఫిజికల్ క్లాసెస్ ప్రారంభించాలని అనుకున్నా కోవిడ్ కేసులు, థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారంతో వెనకడుగు వేసింది. ఆన్లైన్ ,డిజిటల్ తరగతులే నిర్వహించాలని ఆదేశించింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కోవిడ్ పరిస్థితుల పై చర్చించినా ప్రత్యక్ష తరగతుల పై మాత్రం నిర్ణయం తీసుకోలేదు… విద్యా శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వం ఆదేశిస్తే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. మరోవైపు విద్యార్థులు ఇంకా ఇంటికే పరిమితమైతే ఎన్నో అనర్థాలు జరుగుతాయని మేధావులు అంటున్నారు. చిన్న పిల్లలకు కరోన ప్రభావం అంతగా ఉండక పోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఏదో ఒక విధంగా విద్యా సంస్థలు ప్రారంభించాలని సూచించింది.
బాల్య వివాహాలు జరుగుతున్నాయని, పిల్లలు చదువుకు దూరం ఆవుతున్నారని పేర్కొంది. తల్లి దండ్రులు, పిల్లలకి మధ్య సంబంధాలలో తేడా వస్తుందని రిపోర్ట్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . ప్రైవేట్ విద్యా సంస్థలూ కోరుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రారంభించాయని, మరికొన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని అంటున్నాయి..ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకున్నా… ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎప్పటి నుండి ప్రారంభించాలి, ఏ తరగతులకు ప్రారంభించాలి అనే దానిపై ఈ వారం లోనే డిసైడ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతుల పై ఇంటర్ బోర్డ్ ఇంకా నిర్ణయం తీసికోలేదు.. వెంటనే ఆన్లైన్ తరగతులు అయిన ప్రారంభించాలనే డిమాండ్ వస్తోంది.
తాజావార్తలు
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!