Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Warangal Heavy Rains

Warangal: విషాదం.. వరదల బీభత్సంతో 21 మంది మృతి.. ఏడుగురు గల్లంతు

Published Date :July 29, 2023 , 12:34 pm
By NTV WebDesk
Warangal: విషాదం.. వరదల బీభత్సంతో 21 మంది మృతి.. ఏడుగురు గల్లంతు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Warangal: వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతం చేశాయి. రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. చెరువులు ఏరులై పారాయి. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరడమే కాకుండా.. గాలివానకు ఇళ్ల పైకప్పు ఎగిరిపోయాయి. కొందరు నీళ్లల్లో కొట్టుకు పోగా మరికొందరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ సహాయంతో ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంది. వర్షం వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహావిషాదం జరిగింది. ములుగు జిల్లాలో 13 మంది, హనుమకొండ జిల్లాలో ఐదుగురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లిలో ముగ్గురు మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన గల్లంతైన వారిలో గొర్రె ఓదిరెడ్డి, వజ్రమ్మ, కోసం కోనసాగుతున్న గాలింపు చర్యలు చేపట్టారు.

ములుగు జిల్లా బూరుగుపేటకు చెందిన బండ సారమ్మ, రాజమ్మ, ప్రాజెక్టు నగర్ కు చెందిన 4ఏళ్ళ బాలుడు సద్దాం అలీగా గుర్తించారు. వర్షం వరదలతో గ్రేటర్ వరంగల్ తో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో అఫార నష్టం వాటిల్లింది. వరంగల్ లో వరద బురదలోనే ఇంకా 40 కాలనీలు ఉన్నాయి. జంపన్నవాగు ఉదృతితో కొండాయి గ్రామం జలదిగ్బంధంలోనే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా పశువులు మృతి చెందారు. ములుగు జిల్లాలో ఐదు చెరువులకు గండ్లు, తెగిపోయిన 52 రోడ్లు, 43 ఇల్లు పూర్తిగా కూలిపోయాయి. పసర తాడ్వాయి మద్య గుండ్లవాగు బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో జాతీయ రహదారి 163ఫై రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యి కోట్ల వరకు నష్టం వాటిలినట్లు ప్రాథమిక అంచన వేశారు. వర్షం వరదలతో టిఎస్ ఎన్పీడిసిఎల్ కు ఏడుకోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇంకా పలు గ్రామాలకు పవర్ సప్లై నిలిచిపోయింది.

Read also: Bhadrachalam: గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి వరద ఉద్రతి పెరగడంతో గోదావరి ఎగువ భాగంలో జాతీయ రహదారి స్తంభించిపోయింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55 అడుగులకు సమీపంలో ఉంది. దీంతో ఎగువ ప్రాంతంలో హైదరాబాదు, వరంగల్ నుంచి చత్తీస్ గడ్, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ,ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారిపై నీళ్లు చేరుకున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతానికి వచ్చిన లారీలు అన్నీ కూడా రోడ్లమీద చిక్కుకొని పోయాయి భద్రాచలం నుంచి చెట్టు వరకు మధ్య మధ్యలో లారీలన్నీ నిలిచిపోవడంతో గోదావరి ఇంకా పెరుగుదల కనిపిస్తుండతో ఆ లారీలు అన్నిటిని కూడా తిరిగి భద్రాచలం వైపు మళ్ళిస్తున్నారు.

కొమురం భీం జిల్లా సిర్పూర్ (టి) మం..వెంకట్రావు పేట్ అంతరాష్ట్ర బ్రిడ్జ్ పై నుండి పెనుగంగా (వార్దా) నది వరదనీరు ప్రవహిస్తుంది. మహారాష్ట్రకు రాకపోకలు నిలిచి పోయాయి. సిర్పూర్(టి) మం..హుడికిలి వద్ద రోడ్డు పైకి వచ్చిన బ్యాక్ వాటర్ సిర్పూర్(టి) నుండి జక్కాపూర్ మీదగా మహారాష్ట్ర కు రాకపోకలు నిలిచిపోయాయి. పారిగాం వద్ద ప్రధాన రోడ్డు పై ప్రవహిస్తున్న వరదనీరు. సిర్పూర్(టి)- కౌటాల మద్యలో రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్(టి) మండలంలో మూడు మార్గాలలో రాకపోకలు నిలిచిపోయాయి.

గోదావరి వరదలతో చతిస్ గడ్ వెళ్లే జాతీయ రహదారి దిగ్బంధనాలకు గురైంది. జాతీయ రహదారిలో అక్కడక్కడ వరద పట్టేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి .అయితే మరింతగా గోదావరి పెరుగుతుండడంతో కూనవరం రోడ్డులో మధ్యలో ఉన్న లారీలన్నీ చిక్కుకునిపోయాయి .అంతేకాదు హైదరాబాదు నుంచి ఒడిస్సా ఛత్తీస్ గడ్ వెళ్తున్న ప్రైవేటు బస్సులు కూడా చిక్కుకొని పోయాయి. గత అర్ధరాత్రి నుంచి ఈ బస్సులు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భద్రాచలం పక్కన కూడా గోదావరి పెరుగుతుండడంతో ఈ బస్సులు అక్కడే ఉండటం ప్రమాదకరమని ఆ బస్సుల్ని భద్రాచలం వైపు తిప్పి పంపిస్తున్నారు.
Hyderabad MMTS: అలర్ట్.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు రైళ్ల రద్దు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • heavy rains in talangana
  • talangana heavy rains
  • Telangana Rains
  • Warangal
  • Warangal heavy rains

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions