Konda Murali: సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి..
- సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి..
- కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై పరోక్ష విమర్శలు..
- కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని తేల్చి చెప్పిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Murali: వరంగల్ లోని పోచమ్మ మైదానం కూడలిలో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తర్వాత మాట్లాడిన కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేశారు. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. కొండ మురళి పార్టీ మారితే పదవికి రాజీనామా చేసి మారిండు అని పేర్కొన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నారు. నాలాగా దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలను పరోక్షంగా విమర్శించారు కొండ మురళి.
Read Also: Abhishek Bachchan : వాళ్లకు అన్నీ ఇచ్చేసా.. ఒంటరిగా ఉంటా.. అభిషేక్ బచ్చన్ పోస్ట్..
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- CM Revanth Reddy : సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్ను కూడా తీసుకురండి
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఇక, టీడీపీ నుంచి వచ్చిన కనుబొమ్మలు లేని నాయకుడు ఆ రోజు చంద్రబాబుని, ఈరోజు కేసీఆర్, కేటీఆర్లను వెన్నుపోటు పొడిచిండు.. రేవంత్ అన్న ఆయనతో జాగ్రత్తగా ఉండండి అని పరోక్షంగా కడియం శ్రీహరి పేరుని కొండ మురళి ప్రస్తావించారు. అలాగే, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్టే అని వదిలేస్తున్నాను.. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పులో కొండ మురళి ఉన్నంత వరకు రెండో నాయకుడు ఎవరూ ఉండరని తేల్చి చెప్పారు. ఇక, పరకాలలో 75 ఏళ్ల ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.. ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వు, వచ్చే సారి మీకు వదిలేస్తారా అన్నాడు.. అయితే, పరకాల నియోజక వర్గంలో కొండ సుస్మిత పటేల్ రంగ ప్రవేశం చేయనుంది.. మా కార్యకర్తలకు ఇక నుంచి కొండ సుస్మిత పటేల్ అందుబాటులో ఉంటుంది అన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఎవరు కూడా అధైర్య పడొద్దు అని సూచించారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతదని కొందరు ప్రచారం చేస్తున్నారు.. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని తన వెంట రేవంతన్న, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వెల్లడించారు.
తాజావార్తలు
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?