AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఉపశమనం ప్రకటించాయి. ఈ ఏడాది అనుమతించిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి రావడం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, టొబాకో బోర్డు , ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు వెల్లడించారు.
రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి బార్న్కు రూ.50 వేల చొప్పున రెండేళ్ల కాలానికి వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల బార్న్లకు కలిపి దాదాపు రూ.250 కోట్ల వరకు రుణ సదుపాయం లభిస్తుంది. దీనివల్ల దాదాపు 40 వేల మంది పొగాకు రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
Also Read
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
మరోవైపు లో-గ్రేడ్, ఆఫ్-స్టైల్ పొగాకు అమ్మకాలపై జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. కిలోకు రూ.10 చొప్పున ధర లోటు భర్తీ చెల్లించేందుకు రూ.100 కోట్లను కేటాయించింది. ఈ మొత్తాన్ని వ్యవసాయ శాఖ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
వ్యాపారులు, ఎగుమతిదారులు కూడా రైతులకు మేలు జరిగేలా ధరలు చెల్లించేందుకు అంగీకరించారు. బ్రైట్ గ్రేడ్కు రూ.230, మీడియం గ్రేడ్కు రూ.190, లో గ్రేడ్కు రూ.110, ఆఫ్-స్టైల్కు రూ.130 చొప్పున కొనుగోళ్లు జరపనున్నారు. వేలం ప్రక్రియను వేగవంతం చేస్తూ రోజుకు 20 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేసి, రాబోయే రెండు నెలల్లో ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఇతర రాష్ట్రాల పొగాకు మార్కెట్లోకి రాకముందే మన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తీసుకున్న ఈ నిర్ణయాలు పొగాకు రైతులకు కొండంత అండగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!