AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్సీవీ పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఉపశమనం ప్రకటించాయి. ఈ ఏడాది అనుమతించిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి రావడం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, టొబాకో బోర్డు , ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు వెల్లడించారు.
రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి బార్న్కు రూ.50 వేల చొప్పున రెండేళ్ల కాలానికి వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల బార్న్లకు కలిపి దాదాపు రూ.250 కోట్ల వరకు రుణ సదుపాయం లభిస్తుంది. దీనివల్ల దాదాపు 40 వేల మంది పొగాకు రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
Also Read
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
- Jofra Archer: "ఇంత డేంజర్గా ఉన్నావేంట్రా స్వామీ".. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
మరోవైపు లో-గ్రేడ్, ఆఫ్-స్టైల్ పొగాకు అమ్మకాలపై జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. కిలోకు రూ.10 చొప్పున ధర లోటు భర్తీ చెల్లించేందుకు రూ.100 కోట్లను కేటాయించింది. ఈ మొత్తాన్ని వ్యవసాయ శాఖ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
వ్యాపారులు, ఎగుమతిదారులు కూడా రైతులకు మేలు జరిగేలా ధరలు చెల్లించేందుకు అంగీకరించారు. బ్రైట్ గ్రేడ్కు రూ.230, మీడియం గ్రేడ్కు రూ.190, లో గ్రేడ్కు రూ.110, ఆఫ్-స్టైల్కు రూ.130 చొప్పున కొనుగోళ్లు జరపనున్నారు. వేలం ప్రక్రియను వేగవంతం చేస్తూ రోజుకు 20 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేసి, రాబోయే రెండు నెలల్లో ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఇతర రాష్ట్రాల పొగాకు మార్కెట్లోకి రాకముందే మన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తీసుకున్న ఈ నిర్ణయాలు పొగాకు రైతులకు కొండంత అండగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
-
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్లో జరిగిన ఘటన ఏంటి?
-
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!