Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్ రిజిస్ట్రార్ల అక్రమ లావాదేవీలు, అనధికారిక వ్యక్తులతో వారు సాగిస్తున్న చీకటి ఒప్పందాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్లయిన జమాల్పూర్ రామ్ నర్సింహారావు, దేవులూరి ఆనంద్ తమ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులను అనధికారికంగా డాక్యుమెంట్ రైటర్లుగా నియమించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరూ డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రిజిస్ట్రేషన్ల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
కేవలం ఈ అనధికారిక రైటర్లు పంపిన పత్రాలను మాత్రమే సబ్ రిజిస్ట్రార్లు ప్రాధాన్యత ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తేలింది. కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి కాని సుమారు 70 డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్ల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు వాట్సాప్ చాట్ ద్వారా బట్టబయలయ్యాయి. గత ఏడాది కాలంలోనే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఈ ఇద్దరు అధికారులు సుమారు రూ. 42 లక్షలను లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
కార్యాలయంలో సోదాల అనంతరం ఏసీబీ బృందాలు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. వీరి ఇళ్లలో లక్షలాది రూపాయల నగదుతో పాటు భారీగా అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు కనుగొన్నారు. ఇక్కడ ఓ షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఓ అధికారి ఇంట్లో రిజిస్ట్రేషన్ చేయని 254 ప్రభుత్వ పత్రాలు లభించడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు అధికారుల ఇళ్లలో ఎందుకు ఉన్నాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఈ ఇద్దరు అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నగదు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!