Konda Surekha: వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేలా సీఎం కార్యాచరణ..
- రేపు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
- టెక్స్ టైల్ పార్క్.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించనున్న సీఎం..
- వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాం: మంత్రి కొండా సురేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: రేపు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో జిల్లా మంత్రి మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం టూర్ వేళ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. రేపు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నారు.. సీఎం టూర్ పై ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో రివ్యూ చేశాము.. మధ్యాహ్నం 1 వరకు టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుని పరిశీలిస్తారు.. ఆ తరువాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శించి అధికారుల దగ్గర నుంచి వివరాలు తెలుసుకుంటారు.. అనంతరం హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ ఉంటుంది అని తెలిపారు. ఇక, రెండో రాజధానిగా చేసే లక్ష్యంగా అభివృద్ధి చేసేలా సీఎం కార్యాచరణ ఉంది.. మాస్టర్ ప్లాన్ అంశం చర్చకు వస్తాయి.. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సొంత ఎజెండాతో చేసింది అని అర్థం అయ్యింది.. దాన్ని మార్చాల్సి ఉంది అని మంత్రి కొండా సురేఖ చెప్పారు.
Read Also: T20 World Cup 2024: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆఫ్ఘాన్ ఆటగాడు..
Also Read
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
ఇక, మూడు నెలల కాలవ్యవధి పెట్టి మాస్టర్ ప్లాన్ తయారీ చేసే అంశం ఉంటుంది అని మంత్రి సురేఖ అన్నారు. స్మార్ట్ సిటి పనుల అంశంపై చర్చించే అవకాశం ఉంది.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంశం చర్చిస్తాం.. అలాగే కేబుల్ కూడా అండర్ గ్రౌండ్ లోనే ఏర్పాటు చేస్తారు.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం.. దాని సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాము.. ఇప్పటి వరకు 8 కిలోమీటర్ల దూరం మాత్రమే చేశారు.. ఈ అంశం చర్చకు వస్తుంది.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నీ అతి త్వరలో స్వాధీనం చేసుకొని రోగుల అందుబాటులో తెచ్చే అంశంపై చర్చిస్తాం.. ఈ హాస్పిటల్ కేవలం 12 అంతస్తులు మాత్రమే రోగులకు వాడాలి.. దీన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశాన్ని చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం.. మమూనూర్ ఎయిర్ పోర్ట్ అంశం కూడా చర్చకు వస్తుంది.. సీఎం దృష్టి తీసుకెళ్ళి ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగుతుంది.. రూ. 20 కోట్ల లోన్ రేపు మహిళ శక్తి రుణాల ఇస్తారు.. కాళోజీ కళ కేత్రం పనుల ఆలస్యం పైనా చర్చిస్తాం.. వరంగల్ కార్పొరేషన్ కి కొత్త బిల్డింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు చర్చకు వస్తాయని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
తాజావార్తలు
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!