Vijayashanthi: కేసీఆర్వి పగటి కలలే.. కేంద్రంలో మేమే.. తెలంగాణలో వచ్చేది మా సర్కారే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని పదవి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలే.. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీతోనే తెలంగాణలో మార్పు సాధ్యం అన్నారు.. ఇది గ్రేటర్ హైదరాబాద్ కాదు.. గార్బేజ్ హైదరాబాద్ లా ఉందని మండిపడ్డారు.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్తమయం, కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ ను సర్వనాశనం చేశారన్న ఆమె.. హైదరాబాద్ సందుల్లో ఎక్కడ చూసినా… కచరానే దర్శనమిస్తోంది.. వర్షాలు వస్తే మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి.. దోమల నిర్మూలనకు మందు కూడ కొట్టడం లేదని ఆరోపణలు గుప్పించారు.
Read Also: Etela Rajender: కేసీఆర్ను సభకు రాకుండా చేసే బాధ్యత నాదే.. ఈ ప్రభుత్వం ఫీజు పీకాల్సిందే..!
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకుంటున్నారని విమర్శించారు విజయశాంతి… రోడ్లు, డ్రైనేజీ, నాలాల పరిస్థితి అద్వాన్నంగా ఉందన్న ఆమె.. కేసీఆర్ పాలన అతి నీచంగా ఉందంటూ ఫైర్ అయ్యారు.. కేసీఆర్ ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించని కారణంగా, పేదలు వైద్యానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ అమలు చేయడం లేదు.. తెలంగాణను సర్వనాశనం చేసి దోచుకు తింటున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతులను ఆదుకోని కేసీఆర్.. పక్క రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సొమ్మును పంచుతున్నారని విమర్శించారు.. నీలాంటి నీచుడితో ఉద్యమంలో పాల్గొన్నందుకు సిగ్గుతో లెంపలేసుకుంటున్నానని వ్యాఖ్యానించిన ఆమె… ఎంఐఎంతో కలిసి కేసీఆర్ హిందూ సమాజాన్ని తిట్టిస్తున్నాడని ఫైర్ అయ్యారు.. కేసీఆర్, నితీష్ కుమార్ లాంటి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా… నరేంద్ర మోడీని ఏమీ చేయలేరు.. ప్రధాని పదవి విషయంలో కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలేనని.. ప్రధాని అంటేనే బాగ్ మిల్కా బాగ్ లా పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి..
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!