Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
- బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు
- గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
- 20 వేల మెజార్టీతో గెలిచిన రాజకీయ వ్యూహకర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ భారీ విజయం సాధించారు. దాదాపు 20 వేల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నిక కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు జరిగిన పోటీ కాదని.. బీహార్ నాయకత్వంపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన సందేశమని అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు.
‘‘సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని బీహార్ ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ.. నేరపూరిత ధోరణులు, వివాదాస్పద ప్రవర్తన ఉన్న వ్యక్తికి బీహార్ నాయకత్వాన్ని అప్పగించింది. ఇలాంటి నాయకత్వాన్ని బీహార్ ప్రజలు అంగీకరించడం లేదు’’ అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
బంకీపూర్ ఉప ఎన్నికకు ఒకే నియోజకవర్గాన్ని మించిన రాజకీయ ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఈ విజయం బంకీపూర్ ప్రజల విజయమని తెలిపారు. ఎన్నికల ప్రచారం సమయంలో చెప్పినట్లుగానే.. ఇది కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నిక కాదని స్పష్టం చేశారు. ‘‘బీహార్కు మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర ప్రజలు సందేశం పంపే ప్రయత్నమే ఈ ఎన్నిక. నేరపూరిత నేపథ్యం, వివాదాస్పద ప్రవర్తన, వ్యక్తిత్వం లేదా ప్రతిష్ఠపై ప్రశ్నలు ఉన్న వ్యక్తి బీహార్కు నాయకత్వం వహించడం ప్రజలకు ఇష్టం లేదు. విద్యా వ్యవస్థను మెరుగుపరచగల, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగల, ఉపాధి కోసం బీహార్ పిల్లలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించగల మంచి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
రానున్న లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ అభివృద్ధిపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టాలని ప్రశాంత్ కిషోర్ కోరారు. ప్రధాని మోడీ, బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడం, యువత వలసలను అరికట్టడం, బీహార్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి మోడీ, బీజేపీ, అమిత్ షా బీహార్ను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. యువతకు ఉద్యోగాలు కల్పించి, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలసలను అరికట్టాలి. అదే మా ప్రధాన లక్ష్యం. కాంట్రాక్టులు పొందడం కోసం మాత్రమే మేం ఎమ్మెల్యేలు కావాలని అనుకోవడం లేదు. బీహార్ అభివృద్ధి మాత్రమే మా లక్ష్యం’’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం గతంలో పాట్నా వెస్ట్గా ఉండేది. 1995 నుంచి ఈ నియోజకవర్గం బీజేపీకి అత్యంత బలమైన కంచుకోటగా కొనసాగుతోంది. తొలుత బీజేపీ నేత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించగా.. అనంతరం ఆయన కుమారుడు నితిన్ నబిన్ వరుసగా ఐదుసార్లు బంకీపూర్ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబిన్.. రాజ్యసభకు ఎన్నిక కావడంతో తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబిన్ 50 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో బంకీపూర్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్.. జన్ సురాజ్ పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. విద్య, ఉపాధి, క్షేత్రస్థాయి పాలన వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. తొలి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ విజయం సాధిస్తే.. జన్ సురాజ్ పార్టీ రాజకీయంగా మరింత బలపడే అవకాశం ఉంది. ఎన్డీయేతో పాటు మహాగఠ్బంధన్కు కూడా జన్ సురాజ్ పార్టీ బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి ఈ ఫలితం కీలక మలుపుగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?