Tiger in Komaram Bhim: బెజ్జూరు లో బెబ్బులి.. భయంతో జనం పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger in Komaram Bhim: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి తాజాగా బెజ్జూరు మండలం కుకుడ గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. దీంతో ఎద్దు తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు సోమవారం ఉదయం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచరిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని అధికారులు కోరుతున్నారు. బాబాసాగర్ ప్రాంతంలోని చొప్పదండి మొండి కుంట వద్ద మీసాల రాజన్న అనే రైతుకు పులి కనిపించిందని తెలిపాడు. పులిని చూసి పరుగులు పెడుతూ ఇంటికి వచ్చినట్లు స్ధానికులు చెపుతున్నారు.
Read also: Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో పురోగతి.. నిందితుడికి ఐసిస్తో సంబంధాలు
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
రెండు రోజుల క్రితం కాగజ్నగర్ మండలం వేంపల్లి – చలాడ గ్రామ శివారులో కొందరు ప్రయాణికులకు పెద్దపులి కనిపించింది. పులాస్ సర్దార్ అనే వ్యక్తి ప్రాంగణంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఆ పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. ఖానాపూర్, కాగజ్ నగర్, ఎజ్గాం మీదుగా పెద్దపులి వేంపల్లికి చేరుకుందని తెలిపారు. దీని ఆచూకీ కోసం 12 బృందాలు వెతుకుతున్నాయని చెప్పారు. ఇక, తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట మండలాల్లో మూడు రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. తాడ్వాయి మండలం కామరం అటవీ ప్రాంతంలో పశువుల మంద దాడికి యత్నించింది. మంగపేట మండలంలో లేగ దూడపై దాడి చేసి చంపేసింది. తాడ్వాయి మండలం కామరం అడవుల్లో మేతకు వెళ్లిన ఎద్దుల మందపై పెద్దపులి దాడికి యత్నించింది. అది చూసిన పశువుల కాపరి టైగర్ రమేష్ భయంతో అరిచాడు. దీంతో పులి అక్కడి నుంచి పారిపోయింది.
Revanth Reddy: అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలి
తాజావార్తలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!