Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో పురోగతి.. నిందితుడికి ఐసిస్తో సంబంధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangaluru Auto Blast: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంగళూరు ఆటో పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పేలుడు కేసులో కీలక సూత్రధారితో సంబంధం ఉన్న ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. షరీఖ్తో ఎలాంటి సంబంధాలున్నాయి..? ఇంకా ఎవరెవరితో పరిచయముంది అన్న అంశాలపై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి.. పలు కీలకవిషయాలను సేకరించింది. దీనివెనుక ఉగ్రసంస్థలు ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించారు.
నిందితుడు షరీఖ్కు ఐసిస్ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయని.. ఉగ్రవాదులను సంప్రదించడానికి డార్క్ వెబ్ను ఉపయోగించాడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు పెద్ద పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. షరీఖ్ బహుళ హ్యాండ్లర్ల క్రింద పనిచేశాడని, వారిలో ఒకరు ఐసిస్తో ప్రభావితమైన ఉగ్రవాద సంస్థ అయిన అల్ హింద్కు చెందినవారు అని కర్ణాటక డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న అరాఫత్ అలీ షరీఖ్తో టచ్లో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అల్-హింద్ మాడ్యూల్ కేసులో నిందితుడిగా ఉన్న ముస్సావిర్ హుస్సేన్తో కూడా టచ్లో ఉన్నాడన్నారు. అబ్దుల్ మతిన్ తాహా షరీఖ్ ప్రధాన హ్యాండ్లర్లో ఒకడని డీజీపీ పేర్కొ్న్నారు. పీఎఫ్ఐ సంస్థతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
Also Read
- FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
Employees Shock To Twitter : ట్విటర్కు షాక్.. ఒకే సారి 1200మంది ఉద్యోగుల రాజీనామా
పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తిరిగాడు షరీఖ్. ఫేక్ ఆధార్కార్డుతో కర్నాటక లోని పలు ప్రాంతాల్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. 2020లో కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద షరీఖ్ అరెస్టయ్యాడు. అనంతరం సాంకేతిక కారణాల వల్ల షరీఖ్ బెయిల్పై విడుదలయ్యాడు. పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో షరిఖ్ తిరిగాడని.. పలువురిని కలిసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వారందరినీ.. పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళూరు బ్లాస్ట్ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. ఈ కేసులో ఓ ప్రైవేట్ టీచర్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు కారణమైన మహ్మద్ షరీఖ్కు కోయంబత్తూరు లింకులు ఉన్నట్లు గుర్తించారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ టీచర్ సురేందర్.. గాంధీపురంలోని లాడ్జిలో నెల క్రితం ఉన్నట్టు సమాచారం. ఊటీలో స్కూల్ టీచర్గా సురేందర్ పనిచేస్తున్న సురేందర్ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించేందుకు సిద్దమవుతున్నారు. ఆటో పేలుడు కేసును మంగళూరు పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు కూడా విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!