Revanth Reddy: అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ. రేవంత్రెడ్డి, ఇతర టీపీసీసీ నేతలు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో భేటీ అయ్యారు. పోడు భూములు, పోడు భూములపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ సోమేశ్ కుమార్తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. అనంతరం పలు డిమాండ్ లతో వున్న మెమోరండంను సోమేశ్ కుమార్ కు అందజేశారు. ధరణిని రద్దు చేసి పాత పద్దతిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిషేదిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్య పరిష్కరించాలని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read also: Rajinikanth: రజినీకాంత్ జపం చేస్తున్న సోషల్ మీడియా
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి, కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతారని, రైతు సమస్యలపై దశలవారీగా నిరసనలు చేపట్టాలని పార్టీ యోచిస్తోందని తెలిపారు. అలాగే, పార్టీ నేతలు గవర్నర్ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో.. సీఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రేస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్ లు పాల్గొన్నారు.
Botsa Satyanarayana: చంద్రబాబు సహనం కోల్పోయారు
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!