Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Rajya Sabha Members Singhvi Vem Narender Reddy Elected

Rajya Sabha Members : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.. ఏకగ్రీవ ఎన్నిక పూర్తి..!

Published Date :March 9, 2026 , 6:42 pm
By Gogikar Sai Krishna
  • తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవం
  • ఎన్నికల ధృవీకరణ పత్రాలు అందుకున్న నూతన సభ్యులు
  • తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో పోరాటం చేస్తానన్న నరేందర్ రెడ్డి
  • సింఘ్వీ ఎన్నికపై కాంగ్రెస్ వర్గాల్లో హర్షం
Rajya Sabha Members : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.. ఏకగ్రీవ ఎన్నిక పూర్తి..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Rajya Sabha Members : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి నుంచి వారు తమ ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక మరపురాని ఘట్టమని అభివర్ణించారు.

తనను రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ వేం నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో పాటు, మద్దతు తెలిపిన సీపీఐ, ఎంఐఎం నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. శాసనసభ మొత్తం ఏకాభిప్రాయంతో తనను ఎన్నుకోవడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

Also Read

  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
Add as a preferred
source on google

Gas Cylinder : వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పష్టత

రాజ్యసభ సభ్యుడిగా తన ప్రధాన బాధ్యత తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమేనని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. “తెలంగాణ వాణిని ఢిల్లీ వేదికగా బలంగా వినిపిస్తా. రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు , ఇతర సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను” అని ఆయన హామీ ఇచ్చారు.

తన మీద నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రివర్గ సహచరులు తనకు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు. 2004-2009 మధ్య కాలంలో శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఇప్పుడు దేశ అత్యున్నత సభలో ప్రజా సమస్యలపై మాట్లాడటానికి దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కూడా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వడం పట్ల పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. సింఘ్వీ వంటి సీనియర్ నాయకుడు తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించడం వల్ల జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Manu Singhvi
  • Congress Party
  • Rajya Sabha Elections
  • Rajya sabha members
  • revanth reddy

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions