Gas Cylinder : వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పష్టత
- యుద్ధ పరిస్థితుల మధ్య గ్యాస్ సరఫరాపై ప్రభుత్వ స్పష్టత
- తప్పుడు ప్రచారాలతో పెరిగిన పానిక్ బుకింగ్స్
- డొమెస్టిక్ వినియోగదారులకు ప్రాధాన్యత.. కమర్షియల్ సిలిండర్లపై పరిమితి
- పెట్రోల్, డీజిల్ కొరత వార్తలను ఖండించిన చమురు సంస్థలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతాయని లేదా సరఫరా నిలిచిపోతుందనే వార్తలపై ప్రభుత్వం , అధికారులు కీలక స్పష్టతనిచ్చారు. ఈ యుద్ధ ప్రభావం దేశంలో వంట గ్యాస్ సరఫరాపై ఏమాత్రం ఉండదని, రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగానే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, యుద్ధం కారణంగా గ్యాస్ దొరకడం కష్టమవుతుందనే తప్పుడు ప్రచారాల వల్ల ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 శాతం వరకు అదనంగా పానిక్ బుకింగ్స్ నమోదవుతున్నాయని, అయినప్పటికీ పెరిగిన డిమాండ్కు అనుగుణంగా సరఫరాను కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం అదనపు స్టాక్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సిలిండర్ డెలివరీలు ఎక్కడా ఆటంకం లేకుండా స్మూత్ గా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!
Also Read
- Tirumala Tirupati: తిరుమలలో ఎల్నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
- Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. సాధారణంగా గ్యాస్ బుకింగ్ కోసం ఉండే 21 రోజుల స్టాండర్డ్ క్యాప్ను ప్రస్తుతం ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి 50 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లకు, అందులోనూ ముఖ్యంగా ఉజ్వల యోజన కింద ఉన్న 50 లక్షల కనెక్షన్లకు నిరంతరాయంగా సరఫరా అందుతోంది. అయితే, గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కొత్త కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసి, కేవలం అత్యవసర అవసరాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
మరోవైపు, సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్ , డీజిల్ కొరత వార్తలను కూడా ప్రభుత్వం , చమురు సంస్థలు తీవ్రంగా ఖండించాయి. HPCL, BPCL, , IOCL వంటి సంస్థలు దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
8.12 అంగుళాల డిస్ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్ తో వచ్చేస్తున్న OPPO Find N6..!
తాజావార్తలు
-
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
-
Tirumala Tirupati: తిరుమలలో ఎల్నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
-
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!