Minister Sridhar Babu: ఆ భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలి.. కేంద్ర మంత్రిని కోరిన శ్రీధర్ బాబు
- పీఎస్యూలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలి
- కేంద్ర మంత్రిని కోరిన రాష్ట్ర ఐటీ
- పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Sridhar Babu: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్యూ)లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రితో సమావేశమై పలు అంశాలను చర్చించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కింద విక్రయించాలని నిర్ణయించినందున వీటి మిగులు భూములను తిరిగి అప్పగించాలని శ్రీధర్ బాబు అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల్లో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేయగా.. వాటికి అప్పట్లో వేలాది ఎకరాల భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
Read Also: Maharashtra Budget: ముందుగానే ప్రజలకు ఎన్నికల తాయిలాలు.. బడ్జెట్ అంతా వరాలే
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
ఖాయిలా పడిన ఆదిలాబాద్ సీసీఐ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరించి స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని కోరారు. 4 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ సిమెంటు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 2100 ఎకరాల సున్నపు రాతి గనులతో పాటు మొత్తం 2290 ఎకరాల భూమిని ఉచితంగా అందజేసిందని గుర్తు చేశారు. దీనిని ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నందున కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీస్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం ముందుంది. ఇక్కడ భూములు, నీరు, విద్యుత్తు అవసరాల మేరకు అందుబాటులో ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో శిక్షణ పొందిన మానవ వనరులకు కొదవ లేదని, ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ స్థాయిల్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ సమృద్ధిగా ఉందని వెల్లడించారు. రాష్ట్రాన్ని సందర్శించి ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలన్ని శ్రీధర్ బాబు అభ్యర్థనకు కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. త్వరలో హైదరాబాద్కు వచ్చి తన దృష్టికి తెచ్చిన అన్ని విషయాలపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!