Paddy Procurement: కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సర్కార్ మధ్య వరి కొనుగోళ్ల వ్యవహారం విషయంలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది… వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేదిలేదని ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. జనగామ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం.. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రా రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రామా చేస్తోందని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించిన ఎర్రబెల్లి.. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో వరి పంట పెరిగిందని గుర్తు చేశారు. ఇక, 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రశంసించారు మంత్రి ఎర్రబెల్లి.
Read Also: CBI: అవినీతి కేసు.. సీబీఐ కస్టడీకి మాజీ హోంమంత్రి..
Also Read
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
వరి ధాన్యాన్ని కొంటామని బండి సంజయ్ చెప్పారు… రా రైస్ కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటామని చెప్పి ఇప్పుడు వివక్షత చూపుతోందని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి.. కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పే వరకు వదిలేదిలేదని హెచ్చరించారు.. కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు రాజ్యసభలో వ్యతిరేకించామని.. అందువల్లనే తెలంగాణ రైతాంగాన్ని తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి.. రైతులంతా ఏకం కావాలి.. జిల్లా వ్యాప్తంగా రేపు ధర్నాలు చేపడుతున్నామని పిలుపునిచ్చారు.. ఇక, 8వ తేదీన ప్రతి గ్రామంలో ఇంటింటిపై నల్ల జెండా ఎగరేసి చావు డప్పు, బీజేపీ శవయాత్ర చేపట్టాలన్నారు. 11వ తేదీన ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగాయన్న ఆయన.. ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సూచించారు.. ఇక, విభజన చట్టంపై కూడా కేంద్రం మాటనిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
తాజావార్తలు
-
Tollywood Sequels : టాలీవుడ్ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
-
E20 Fuel: ఈ20 ఇంధనంపై విమర్శలకు గడ్కరీ కౌంటర్.. ఏమన్నారంటే..!
-
Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్పై ముస్లిం మతగురువు ఆగ్రహం
-
AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
-
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!