Maoists Free State : అతిత్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ.. మిగిలింది వీళ్లే..!
- అతిత్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
- ప్రస్తుతం తెలంగాణకు చెందిన 17 మంది మావోయిస్టులే మిగిలి ఉన్నారంటున్న పోలీసులు
- పోలీసుల చేతిలో తెలంగాణకు చెందిన 17 మంది మావోయిస్టుల జాబితా
- వీరు లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనున్న తెలంగాణ
- 17 మంది లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి విజ్ఞప్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Free State : తెలంగాణ రాష్ట్రాన్ని అతి త్వరలోనే ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’గా ప్రకటించేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన కేవలం 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే మిగిలి ఉన్నారని, వారు కూడా లొంగిపోతే రాష్ట్రం పూర్తిస్థాయిలో మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం, అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ 17 మంది నేతలపై ప్రభుత్వం భారీగా రివార్డులను ప్రకటించింది. వీరిపై మొత్తం కలిపి 2 కోట్ల 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఐదుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉండటం గమనార్హం.
Bandi Sanjay : తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
పదవుల వారీగా విభజన:
- సెంట్రల్ కమిటీ: 4 నుండి 5 గురు సభ్యులు.
- స్టేట్ కమిటీ: 5 నుండి 6 గురు సభ్యులు.
- డివిజన్ కమిటీ: 6 నుండి 7 గురు సభ్యులు.
సెంట్రల్ కమిటీ సభ్యులు:
- ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి)
- తిప్పిరి తిరుపతి (దేవ్ జీ)
- మల్లారాజి రెడ్డి (సంగ్రామ్)
- పసునూరి నరహరి (సంతోష్)
స్టేట్ కమిటీ సభ్యులు:
- ముప్పిడి సాంబయ్య (సుదర్శన్)
- వార్త శేఖర్ (మంగుత్)
- జోడే రత్నా భాయ్
- నక్కా సుశీల
- లోకేటి చంద్ర శేఖర్
- దామోదర్
డివిజన్ కమిటీ సభ్యులు:
- రాజేశ్వరి
- రంగబోయిన భాగ్య
- బాడిషా ఉంగా
- సంగీత
- భవాణి
- మైసయ్య
- భగత్ సింగ్
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఈ 17 మంది మావోయిస్టు నేతలకు కీలక విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను వినియోగించుకుని లొంగిపోవాలని ఆయన సూచించారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ముగిసేలోపే తెలంగాణలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో బలగాలు మోహరించడం, నిఘా పెంచడం ద్వారా మావోయిస్టుల కదలికలను కట్టడి చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం, తెలంగాణలో ప్రస్తుతం చివరి అంకానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. మిగిలి ఉన్న ఈ 17 మంది అగ్రనేతలు గనుక పోలీసులకు లొంగిపోతే, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?