Maoists Free State : అతిత్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ.. మిగిలింది వీళ్లే..!
- అతిత్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
- ప్రస్తుతం తెలంగాణకు చెందిన 17 మంది మావోయిస్టులే మిగిలి ఉన్నారంటున్న పోలీసులు
- పోలీసుల చేతిలో తెలంగాణకు చెందిన 17 మంది మావోయిస్టుల జాబితా
- వీరు లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనున్న తెలంగాణ
- 17 మంది లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి విజ్ఞప్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Free State : తెలంగాణ రాష్ట్రాన్ని అతి త్వరలోనే ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’గా ప్రకటించేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన కేవలం 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే మిగిలి ఉన్నారని, వారు కూడా లొంగిపోతే రాష్ట్రం పూర్తిస్థాయిలో మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం, అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ 17 మంది నేతలపై ప్రభుత్వం భారీగా రివార్డులను ప్రకటించింది. వీరిపై మొత్తం కలిపి 2 కోట్ల 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఐదుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉండటం గమనార్హం.
Bandi Sanjay : తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం
Also Read
పదవుల వారీగా విభజన:
- సెంట్రల్ కమిటీ: 4 నుండి 5 గురు సభ్యులు.
- స్టేట్ కమిటీ: 5 నుండి 6 గురు సభ్యులు.
- డివిజన్ కమిటీ: 6 నుండి 7 గురు సభ్యులు.
సెంట్రల్ కమిటీ సభ్యులు:
- ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి)
- తిప్పిరి తిరుపతి (దేవ్ జీ)
- మల్లారాజి రెడ్డి (సంగ్రామ్)
- పసునూరి నరహరి (సంతోష్)
స్టేట్ కమిటీ సభ్యులు:
- ముప్పిడి సాంబయ్య (సుదర్శన్)
- వార్త శేఖర్ (మంగుత్)
- జోడే రత్నా భాయ్
- నక్కా సుశీల
- లోకేటి చంద్ర శేఖర్
- దామోదర్
డివిజన్ కమిటీ సభ్యులు:
- రాజేశ్వరి
- రంగబోయిన భాగ్య
- బాడిషా ఉంగా
- సంగీత
- భవాణి
- మైసయ్య
- భగత్ సింగ్
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఈ 17 మంది మావోయిస్టు నేతలకు కీలక విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను వినియోగించుకుని లొంగిపోవాలని ఆయన సూచించారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ముగిసేలోపే తెలంగాణలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో బలగాలు మోహరించడం, నిఘా పెంచడం ద్వారా మావోయిస్టుల కదలికలను కట్టడి చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం, తెలంగాణలో ప్రస్తుతం చివరి అంకానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. మిగిలి ఉన్న ఈ 17 మంది అగ్రనేతలు గనుక పోలీసులకు లొంగిపోతే, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!