Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణపై చర్చ..?
Revanth Reddy: రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ హైకమాండ్ అనుమతితోనే కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 19న (మంగళవారం) సీఎం రేవంత్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో నియామకాలపై పార్టీలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కోసం పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా హైకమాండ్ తో చర్చించనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పదవుల పంపకం జరగనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో లోక్సభ అభ్యర్థుల విషయంలో కూడా ఓ క్లారిటీ రానుంది.
Read also: Bigg Boss7 Telugu : రన్నర్ గా అమర్ ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా? ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే..
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 11 మంది మంత్రులకు శాఖలను కేటాయించింది. మరో ఆరు ఖాళీల భర్తీకి మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పేర్లపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అయితే కేబినెట్ను ఎప్పుడు విస్తరిస్తారనే దానిపై స్పష్టత లేదు. కానీ మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులెవరూ గెలుపొందనప్పటికీ, నాంపల్లిలో ఓడిపోయిన ఫిరోజ్ఖాన్ మైనారిటీ కోటాలో పోటీ చేస్తున్నారు. అదే కోటా కోసం నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓడిపోయిన షబ్బీర్ అలీ కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఆయనను మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
Read also: Bigg Boss7 Telugu : రన్నర్ గా అమర్ ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా? ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే..
అలాగే..అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వీరికి మంత్రులుగా అవకాశం కల్పించి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసిన విషయం తెలిసిందే… మొదటి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు.. కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్లో ఉంచారు. ఇందులో హోం శాఖతోపాటు విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మిగిలిన ఆరు స్థానాలకు 15 మంది పోటీ పడుతున్నారని సమాచారం.
LIC Credit Card : ఎల్ఐసీ క్రెడిట్ కార్డు.. ఈ కార్డు బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
తాజావార్తలు
-
RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!