Sabarimala Darshan 2023: అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. వారికి ప్రత్యేక గేటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Separate Gate for Childrens at Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శబరిమలలో భారీ రద్దీ కారణంగా కొందరు భక్తులు అయ్యప్పను నేరుగా దర్శించుకోకుండానే.. వెనుదిరుగుతున్నారు. చాలా మంది దూరం నుంచి అయ్యప్ప కొండకు మొక్కి తిరుగుపయనం అవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా టీబీడీ ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇరుముడులు కట్టుకున్న అయ్యప్ప భక్తులు, జనంతో లైన్లు కిక్కిరిసిపోతుండటంతో.. చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఒక బాలిక స్పృహ తప్పి పడిపోగా.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనను నేపథ్యంలో చిన్నారులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీబీడీ నిర్ణయించింది. ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది. టీబీడీ నిర్ణయంతో చిన్నారులు అయ్యప్పస్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా.. వారి తల్లిదండ్రులకు కూడా ఉపశమనం కలుగుతుందని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
Also Read: KL Rahul: కెప్టెన్గా ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్!
మరోవైపు శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా త్వరలో వైఫై సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో దర్శన సమయాన్ని మరో గంట సేపు పొడగిస్తున్నట్లు గత వారంలో టీబీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకు రెండో విడతలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్పస్వామి భక్తులకు దర్శనం ఇస్తుండగా.. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభిస్తోంది. దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచి నీరు, బిస్కెట్లను టీబీడీ అందిస్తోంది.
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!