Sabarimala Darshan 2023: అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. వారికి ప్రత్యేక గేటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Separate Gate for Childrens at Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శబరిమలలో భారీ రద్దీ కారణంగా కొందరు భక్తులు అయ్యప్పను నేరుగా దర్శించుకోకుండానే.. వెనుదిరుగుతున్నారు. చాలా మంది దూరం నుంచి అయ్యప్ప కొండకు మొక్కి తిరుగుపయనం అవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా టీబీడీ ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇరుముడులు కట్టుకున్న అయ్యప్ప భక్తులు, జనంతో లైన్లు కిక్కిరిసిపోతుండటంతో.. చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఒక బాలిక స్పృహ తప్పి పడిపోగా.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనను నేపథ్యంలో చిన్నారులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీబీడీ నిర్ణయించింది. ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది. టీబీడీ నిర్ణయంతో చిన్నారులు అయ్యప్పస్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా.. వారి తల్లిదండ్రులకు కూడా ఉపశమనం కలుగుతుందని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
Also Read: KL Rahul: కెప్టెన్గా ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్!
మరోవైపు శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా త్వరలో వైఫై సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో దర్శన సమయాన్ని మరో గంట సేపు పొడగిస్తున్నట్లు గత వారంలో టీబీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకు రెండో విడతలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్పస్వామి భక్తులకు దర్శనం ఇస్తుండగా.. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభిస్తోంది. దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచి నీరు, బిస్కెట్లను టీబీడీ అందిస్తోంది.
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!