Sabarimala Darshan 2023: అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. వారికి ప్రత్యేక గేటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Separate Gate for Childrens at Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శబరిమలలో భారీ రద్దీ కారణంగా కొందరు భక్తులు అయ్యప్పను నేరుగా దర్శించుకోకుండానే.. వెనుదిరుగుతున్నారు. చాలా మంది దూరం నుంచి అయ్యప్ప కొండకు మొక్కి తిరుగుపయనం అవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా టీబీడీ ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇరుముడులు కట్టుకున్న అయ్యప్ప భక్తులు, జనంతో లైన్లు కిక్కిరిసిపోతుండటంతో.. చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఒక బాలిక స్పృహ తప్పి పడిపోగా.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనను నేపథ్యంలో చిన్నారులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీబీడీ నిర్ణయించింది. ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది. టీబీడీ నిర్ణయంతో చిన్నారులు అయ్యప్పస్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా.. వారి తల్లిదండ్రులకు కూడా ఉపశమనం కలుగుతుందని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read
- Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
- iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
Also Read: KL Rahul: కెప్టెన్గా ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్!
మరోవైపు శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా త్వరలో వైఫై సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో దర్శన సమయాన్ని మరో గంట సేపు పొడగిస్తున్నట్లు గత వారంలో టీబీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకు రెండో విడతలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్పస్వామి భక్తులకు దర్శనం ఇస్తుండగా.. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభిస్తోంది. దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచి నీరు, బిస్కెట్లను టీబీడీ అందిస్తోంది.
తాజావార్తలు
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!