CM KCR Suffering From Fever: సీఎం కేసీఆర్కు జ్వరం.. మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి హస్తినపర్యటనకు వెళ్లిన పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అక్కడే మకాం వేశారు.. టీఆర్ఎస్ను జాతీయస్థాయిలో విస్తరించేందుకు వీలుగా బీఆర్ఎస్గా పేరు మార్చిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.. యూపీ మాజీ సీఎం, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన కేసీఆర్.. అటు నుంచి నేరుగా హస్తినకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలో బీఆర్ఎస్ కోసం కొత్తగా లీజుకు తీసుకున్న భవనాన్ని పరిశీలించిన ఆయన.. మరమ్మత్తలకు కొన్ని సూచనలు చేశారు.. మరుసటి రోజు వసంత్ విహార్లో కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ పనులను పర్యవేక్షించి.. కొన్ని కీలక సూచనలు చేశారు.. అయితే, ఆ తర్వాత ఆయన అధికారిక నివాసానికే పరిమితం అయినట్టు వార్తలు వచ్చాయి.. తీరా విషయం ఏంటంటే.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారట.. దీంతో.. మరికొన్ని రోజులు.. హస్తినలోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది..
Read Also: CJI Justice DY Chandrachud: సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. కేంద్రం ఆమోదం..
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
అయితే, ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ నుంచి ఉన్నతాధికారులకు పిలుపువచ్చింది.. దీంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హస్తినబాట పట్టారు.. పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకే ఉన్నతాధికారులను కేసీఆర్ ఢిల్లీకి పిలిచినట్టుగా సమాచారం… కాగా, గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన తెలంగాణ సీఎం.. మరో నాలుగు రోజులు అక్కడే ఉంటారని చెబుతున్నారు. సీఎంగా కొనసాగుతూనే దేశవ్యాప్తంగా పర్యటిస్తానని.. బీఆర్ఎస్ విస్తరణ కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలు సాగుతూనే ఉంటాయని ప్రకటించిన కేసీఆర్.. ఢిల్లీలోనే మకాం వేశారంటే.. ఇంకా ఏదైనా ప్లాన్ ఉందా? మేథావులను, సీనియర్ పాత్రికేయులను, ఆర్థికవేత్తలను ఇతర పార్టీల కీలక నేతలు, ప్రజాసంఘాల నేతలను, ఉత్తర భారత దేశానికి చెందిన ప్రజాప్రతినిధులను కలుస్తారా? అనేది ఆస్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!