TG Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై చర్చ
- హైకోర్టు తీర్పుతో కాళేశ్వరం కేసులో కొత్త మలుపు
- కమిషన్పై ‘క్లీన్ చిట్’ లేదంటూ ఉత్తమ్ స్పష్టం
- NDSA, విజిలెన్స్ రిపోర్టులపై క్యాబినెట్ ఫోకస్
- తదుపరి చర్యలపై రేపటి భేటీలో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Cabinet Meeting : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను లోతుగా విశ్లేషించి, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం వేయబోయే తదుపరి అడుగు గురించి ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ పరిణామాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, బీఆర్ఎస్ నేతలు ఆశించినట్లుగా వారికి కోర్టు నుంచి ఎటువంటి ‘క్లీన్ చిట్’ లభించలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ , హరీష్ రావు కోరినట్లుగా కమిషన్ ఏర్పాటును కోర్టు తప్పుబట్టలేదని, కేవలం కొన్ని సాంకేతిక అంశాలను మాత్రమే ప్రస్తావించిందని ఆయన వివరించారు. కమిషన్ నియామకాన్ని కోర్టు సమర్థించడం ప్రభుత్వ ధోరణికి దక్కిన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత నిజమో, అది కూలిపోవడం కూడా అంతే నిజమని మంత్రి ఉత్తమ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేవలం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే తాము చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, ఇప్పటికే తమ వద్ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) , విజిలెన్స్ విభాగానికి సంబంధించిన నివేదికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఎన్డీఎస్ఏ నివేదిక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో మంత్రులందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ప్రభుత్వం తన తదుపరి అడుగు వేయనుంది.
కోర్టు తీర్పులో పేర్కొన్న సాంకేతిక పరమైన అంశాలను ఎలా అధిగమించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫారసు చేసిన నేపథ్యంలో, కోర్టు తీర్పు తర్వాతి పరిణామాలను పరిగణనలోకి తీసుకుని విచారణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం ఒక స్పష్టమైన నిర్ణయానికి రానుంది. మొత్తానికి, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న న్యాయపరమైన ఉత్కంఠకు రేపటి కేబినెట్ సమావేశం ఒక దిశను చూపే అవకాశం ఉంది.
Karnataka: దారుణం.. హోమ్స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..