TG Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై చర్చ
- హైకోర్టు తీర్పుతో కాళేశ్వరం కేసులో కొత్త మలుపు
- కమిషన్పై ‘క్లీన్ చిట్’ లేదంటూ ఉత్తమ్ స్పష్టం
- NDSA, విజిలెన్స్ రిపోర్టులపై క్యాబినెట్ ఫోకస్
- తదుపరి చర్యలపై రేపటి భేటీలో కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Cabinet Meeting : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను లోతుగా విశ్లేషించి, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం వేయబోయే తదుపరి అడుగు గురించి ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ పరిణామాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, బీఆర్ఎస్ నేతలు ఆశించినట్లుగా వారికి కోర్టు నుంచి ఎటువంటి ‘క్లీన్ చిట్’ లభించలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ , హరీష్ రావు కోరినట్లుగా కమిషన్ ఏర్పాటును కోర్టు తప్పుబట్టలేదని, కేవలం కొన్ని సాంకేతిక అంశాలను మాత్రమే ప్రస్తావించిందని ఆయన వివరించారు. కమిషన్ నియామకాన్ని కోర్టు సమర్థించడం ప్రభుత్వ ధోరణికి దక్కిన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత నిజమో, అది కూలిపోవడం కూడా అంతే నిజమని మంత్రి ఉత్తమ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేవలం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే తాము చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, ఇప్పటికే తమ వద్ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) , విజిలెన్స్ విభాగానికి సంబంధించిన నివేదికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఎన్డీఎస్ఏ నివేదిక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో మంత్రులందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ప్రభుత్వం తన తదుపరి అడుగు వేయనుంది.
కోర్టు తీర్పులో పేర్కొన్న సాంకేతిక పరమైన అంశాలను ఎలా అధిగమించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫారసు చేసిన నేపథ్యంలో, కోర్టు తీర్పు తర్వాతి పరిణామాలను పరిగణనలోకి తీసుకుని విచారణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై మంత్రివర్గం ఒక స్పష్టమైన నిర్ణయానికి రానుంది. మొత్తానికి, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న న్యాయపరమైన ఉత్కంఠకు రేపటి కేబినెట్ సమావేశం ఒక దిశను చూపే అవకాశం ఉంది.
Karnataka: దారుణం.. హోమ్స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత
తాజావార్తలు
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!