MS Dhoni: ధోనీకి “లెఫ్టినెంట్ కల్నల్” హోదా ఇవ్వడం నాకు ఇష్టం లేకుండే.. రిటైర్డ్ లెఫ్టినెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: ఎంఎస్ ధోనీ అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్. కానీ.. ధోనీలో రెండో కోణం కూడా ఉంది. ధోనీ అంకితభావం కలిగిన దేశభక్తుడిగానూ గుర్తింపు పొందారు. దేశం కోసం తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. భారత ప్రాదేశిక సైన్యం (Territorial Army) లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కొనసాగుతున్నారు. అయితే, ధోనీకి ఈ అత్యున్నత హోదా ఇవ్వడం వెనుక తొలినాళ్లలో కొంత వ్యతిరేకత ఉండేదన్న ఆసక్తికర విషయాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ఇటీవల ఒక పోడ్కాస్ట్లో పంచుకున్నారు.
READ MORE: భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
Also Read
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
అప్పట్లో ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె. సింగ్, ధోనీకి ఈ గౌరవ హోదా ఇవ్వాలని నిర్ణయించినప్పుడు వినోద్ భాటియా కొంత అసహనం వ్యక్తం చేశారట. దానికి ఒక బలమైన కారణం ఉందని భాటియా వెల్లడించారు. “భారత సైన్యంలో ‘మెరూన్ బెరెట్’ (Maroon Beret) ధరించడం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయం. ఒక సామాన్య పౌరుడికి ఈ గౌరవాన్ని ఇవ్వడం వల్ల పారాట్రూపర్ల విలువ తగ్గుతుందేమోనని నేను భావించాను. సాధారణంగా పారాట్రూపర్ కావాలంటే ఆరు నెలల కఠినమైన శిక్షణ (ప్రొబేషన్) పూర్తి చేయాలి. ఆ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందంటే, అందులో కేవలం 20 శాతం మంది మాత్రమే విజయం సాధించగలరు. అభ్యర్థి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే స్థాయిలో ఉండే ఆ శిక్షణ లేకుండా మెరూన్ బెరెట్ ఇవ్వడం సరికాదని నేను తొలినాళ్లలో అనుకున్నాను. కానీ, ధోనీ తన ప్రవర్తనతో ఆ అంచనాలను తలకిందులు చేశారు. గౌరవ హోదా లభించిన తర్వాత ధోనీ ఒక సాధారణ సైనికుడిలాగే తన విధులను నిర్వర్తించారు. 2011లో 106 పారా టీఏ బెటాలియన్లో లెఫ్టినెంట్ కల్నల్గా చేరిన ఆయన, 2015లో ఐదు పారాచూట్ జంప్లు విజయవంతంగా పూర్తి చేసి ‘పారా వింగ్’ చిహ్నాన్ని సాధించారు. తనకు ఎత్తు అంటే భయమని స్వయంగా ధోనీ ఒప్పుకున్నప్పటికీ, దేశం పట్ల ఉన్న మక్కువతో ఆ భయాన్ని జయించి మరీ పారాచూట్ జంప్స్ చేశాడు.” అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వివరించారు. ధోనీ నిబద్ధతను దగ్గరుండి చూసిన వినోద్ భాటియా, తన పాత అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నారట. ధోనీ జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ (LoC) వరకు ప్రయాణించి, మన సైనిక యూనిట్లతో కలిసి పనిచేశారని వెల్లడించారు. ఒక సైనికుడికి ఉండాల్సిన క్రమశిక్షణ, నడక, గౌరవం ఆయనలో పుష్కలంగా ఉన్నాయని భాటియా కొనియాడారు. కేవలం హోదా కోసమే కాకుండా, మనసున్న సైనికుడిగా ధోనీ వ్యవహరించిన తీరు తనను ఎంతో గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?