MS Dhoni: ధోనీకి “లెఫ్టినెంట్ కల్నల్” హోదా ఇవ్వడం నాకు ఇష్టం లేకుండే.. రిటైర్డ్ లెఫ్టినెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: ఎంఎస్ ధోనీ అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్. కానీ.. ధోనీలో రెండో కోణం కూడా ఉంది. ధోనీ అంకితభావం కలిగిన దేశభక్తుడిగానూ గుర్తింపు పొందారు. దేశం కోసం తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. భారత ప్రాదేశిక సైన్యం (Territorial Army) లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కొనసాగుతున్నారు. అయితే, ధోనీకి ఈ అత్యున్నత హోదా ఇవ్వడం వెనుక తొలినాళ్లలో కొంత వ్యతిరేకత ఉండేదన్న ఆసక్తికర విషయాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ఇటీవల ఒక పోడ్కాస్ట్లో పంచుకున్నారు.
READ MORE: భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
అప్పట్లో ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె. సింగ్, ధోనీకి ఈ గౌరవ హోదా ఇవ్వాలని నిర్ణయించినప్పుడు వినోద్ భాటియా కొంత అసహనం వ్యక్తం చేశారట. దానికి ఒక బలమైన కారణం ఉందని భాటియా వెల్లడించారు. “భారత సైన్యంలో ‘మెరూన్ బెరెట్’ (Maroon Beret) ధరించడం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయం. ఒక సామాన్య పౌరుడికి ఈ గౌరవాన్ని ఇవ్వడం వల్ల పారాట్రూపర్ల విలువ తగ్గుతుందేమోనని నేను భావించాను. సాధారణంగా పారాట్రూపర్ కావాలంటే ఆరు నెలల కఠినమైన శిక్షణ (ప్రొబేషన్) పూర్తి చేయాలి. ఆ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందంటే, అందులో కేవలం 20 శాతం మంది మాత్రమే విజయం సాధించగలరు. అభ్యర్థి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే స్థాయిలో ఉండే ఆ శిక్షణ లేకుండా మెరూన్ బెరెట్ ఇవ్వడం సరికాదని నేను తొలినాళ్లలో అనుకున్నాను. కానీ, ధోనీ తన ప్రవర్తనతో ఆ అంచనాలను తలకిందులు చేశారు. గౌరవ హోదా లభించిన తర్వాత ధోనీ ఒక సాధారణ సైనికుడిలాగే తన విధులను నిర్వర్తించారు. 2011లో 106 పారా టీఏ బెటాలియన్లో లెఫ్టినెంట్ కల్నల్గా చేరిన ఆయన, 2015లో ఐదు పారాచూట్ జంప్లు విజయవంతంగా పూర్తి చేసి ‘పారా వింగ్’ చిహ్నాన్ని సాధించారు. తనకు ఎత్తు అంటే భయమని స్వయంగా ధోనీ ఒప్పుకున్నప్పటికీ, దేశం పట్ల ఉన్న మక్కువతో ఆ భయాన్ని జయించి మరీ పారాచూట్ జంప్స్ చేశాడు.” అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వివరించారు. ధోనీ నిబద్ధతను దగ్గరుండి చూసిన వినోద్ భాటియా, తన పాత అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నారట. ధోనీ జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ (LoC) వరకు ప్రయాణించి, మన సైనిక యూనిట్లతో కలిసి పనిచేశారని వెల్లడించారు. ఒక సైనికుడికి ఉండాల్సిన క్రమశిక్షణ, నడక, గౌరవం ఆయనలో పుష్కలంగా ఉన్నాయని భాటియా కొనియాడారు. కేవలం హోదా కోసమే కాకుండా, మనసున్న సైనికుడిగా ధోనీ వ్యవహరించిన తీరు తనను ఎంతో గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!