Bhatti Vikramarka: టాక్స్ రెవెన్యూ 40 వేలకోట్లా!.. టాక్స్ వేశారా? వేయాలని ఆలోచిస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: ట్యాక్స్ రెవెన్యూ రూ.40 వేళా కోట్లు చూపెట్టారని, దీనిపై ట్యాక్స్ వేశారా? వేయాలని ఆలోచిస్తున్నారా..?అంటూ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దేశ సంపద దోపిడీకి గురి అవతోందని ఆగ్రహంమం వ్యక్తం చేశారు. రూ.41 వేల కోట్లు గ్రాంట్స్ అంచనా వేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రూ.8 వేల కోట్లు దాటలేదన్నారు. రూ. 4.86 వేలకోట్ల అప్పు చేశారని తెలిపారు. ఈ అప్పులు ఎవరు కట్టాలి? అని ప్రశ్నించారు. సామాన్యుల మీదనే కదా భారం వేసేది అంటూ మండిపడ్డారు. తలసరి ఆదాయం పెరిగింది అని లెక్కలు చెప్తున్నారూ.. ఎలా పెరిగాయి చెప్పండి? అంటూ ప్రశ్నించారు. ఆదాయం పెరిగింది కొందరికె అంటూ పారిశ్రామిక వేత్తల పేర్లు ప్రస్తావించిన భట్టి. రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరిగింది పార్థసారథి రెడ్డి, పిచ్చిరెడ్డి.. జూపల్లి రామేశ్వర్ రావు, మేఘా కృష్ణా రెడ్డి ల ఆదాయం పెరిగిందని వ్యాఖ్యానించారు.
Read also: MLA’s Purchase: ఎమ్మెల్యేల ఎర కేసు.. 17న విచారిస్తామన్న సుప్రీం కోర్టు
Also Read
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
పేదలకు ఇండ్ల జాగా ఇవ్వండి అంటూ డిమాండ్ చేశారు. తన నియోజకవర్గం లో ప్రియాంక అనే మహిళ నన్ను అడిగిందని, మూడు తరాల వాళ్ళం ఒకటే గదిలో కాపురం చేస్తున్నాం అని బాధ పడిందని తెలిపారు. రాష్ట్రంలో ఓ వ్యక్తికి రెండు లక్షల స్కోయర్ ఫీట్ల ఇల్లు ఉందని, పేదలకు అసలు ఇంటి జాగా లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు పెరిగిపోయాయని ఖ్యానించారన్నారు. రాహుల్ గాంధీ దేశం అంతా తిరిగి చెప్పారని, భారత దేశం కోరుకున్నది విద్వేష రాజకీయాలు కాదని తెలిపారు. భారత్ జోడో యాత్రలో పేదలు రైతులు అంతా దేశాన్ని కాపాడండి అని చెప్పారని పేర్కొన్నారు భట్టి. రాహుల్ గాంధీ చెప్తే బీజేపీ అవహేళన చేసిందని మండిపడ్డారు. ఆధాని కంపనీ ఏం చేసింది అనేది బయట పడిందని వ్యాఖ్యానించారు. అధాని మీద దాడి అంటే.. దేశం మీద దాడి అంటుందని. ఇదేం పద్ధతి? అంటూ ప్రస్తావించారు. మతం మత్తు మందు లాంటిది అన్నారు. జ్ఞానంతో పాలన చేయండి అని చెప్పిన సోక్రటిస్ కి విషం ఇచ్చి చంపారని గుర్తు చేశారు. నాగరిక సమాజంలో.. మళ్ళీ మతం పేరుతో రాజకీయం ఏంటి? అని ప్రశ్నించారు.
Read also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరో కీలక వ్యక్తి అరెస్టు
దేశంలో ఎలా ఉందో రాష్ట్రంలో కూడా అలాగే ఉందని ఆరోపించారు. భూమి లేని పేదల గురించి ఆలోచన చేయండి.. ఇండ్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వండి అని కోరారు. భూపంపిణీ చేయాలి కానీ.. పంపిణీ చేసిన స్థలాలు వెనక్కి లాక్కుంటున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు..అసైన్డ్ భూములు తీసుకోకండి అని సూచించారు. సమస్యలు చూపెట్టడం కాదు.. పరిష్కారం కూడా చేయాలని కోరారు. యువత ఉద్యోగాల కోసం చూస్తుందని, ఉద్యోగాలు లేక పెండ్లిళ్ల సప్లైర్ గా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు ఆసుపత్రిలను కంట్రోల్ చేయండి, పేదలు వెళ్తే లక్షల్లో బిల్లులు వేస్తున్నారని కోరారు. ఇటీవల అపోలో కి వెళ్లిన పేషేంట్ కి 9 లక్షలు వేశారని, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. ప్రభుత్వం కంట్రోల్ చేయాలని కోరారు. నారాయణ..చైతన్య కాలేజిలో లక్షల ఫీజు వసూలు చేస్తున్నారని కంట్రోల్ చేయండి అని తెలిపారు. కృష్ణ నదిలో మన వాటా ఎంతో ఇంకా తేల్చలేదు అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై కట్టిన ప్రాజెక్టుల లో ఎన్నిటికి డిపీఆర్లు ఉన్నాయి? సభలో పెట్టండి? అంటూ ప్రశ్నించారు. మా గొంతు నొక్కితే తెలంగాణకు నష్టం అన్నారు. మీరు చేసినా చేయకపోయినా మేము చెప్తమన్నా భట్టి విక్రమార్క.
Revanth Reddy: ప్రగతిభవన్ వాఖ్యలపై రేవంత్ స్పందన.. కేసులకు భయపడను కొత్త ఏమి కాదు
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!