Revanth Reddy: ప్రగతిభవన్ వాఖ్యలపై రేవంత్ స్పందన.. కేసులకు భయపడను కొత్త ఏమి కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: నేను కేసులకు భయపడను..నాకు కొత్త ఏమి కాదంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతిభవన్పై వాఖ్యలపై స్పందించిన ఆయన మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న తీవ్రంగా మండిపడ్డారు. 2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు. మొదటి సంతకం పొడుభూముల సమస్య పరిష్కరిస్తామన్నారు. పొంగులేటి సిద్ధాంతం మంచింది ఆయన ఎంచుకున్న బీజేపీ విధానం సరైంది కాదన్నారు. పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. ఇప్పటికే బీజేపీలో చేరిని వారు ఇబ్బందులు పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రగతిభవన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.. నేను కేసులకు భయపడను..నాకు కొత్త ఏమి కాదంటూ కొట్టిపడేశారు. కేసీఆర్ భూతం లాంటివాడు పట్టి సీసాలో బందించాలని లేకపోతే తట్టుకోలేమని సంచలన వాఖ్యలు చేశారు. తెలంగాణ జేఏసీ జానారెడ్డి ఇంట్లో పుట్టిందని తెలిపిన రేవంత్ జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ అన్నారు. కేసీఆర్ కి చేతకాదనే కోదండరాంను చైర్మన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Woman trap: బాలికపై మరో మహిళ ట్రాప్.. యువకులకు అప్పగించి దారుణం
Also Read
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ళమీద పడ్డ వ్యక్తి కేసీఆర్ అంటూ మాట్లాడారు. తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్ళను ప్రగతి భవన్ లో కూర్చోబెట్టిండు కేసీఆర్ అన్నారు. 90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని తీవ్రంగా ఆరోపించారు. రసమయి బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు మంత్రిని చేయొచ్చు కదా? అంటూ ప్రశ్నించారు. ఏబీసీడీలు రాని ఎర్రబెల్లిని కులం చూసుకొని మంత్రిని చేశారని తెలిపారు. ఆయన మంత్రిత్వ శాఖ పేరును తప్పులు లేకుండా రాయడం కూడా రాదు ఎర్రబెల్లికి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోవర్ట్ ఆపరేషన్లలో దయాకర్ రావు ఎక్స్పర్ట్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెష్ పార్టీ నుండి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలల పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు.. 60 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేసి ప్రజలనుతాగుబోతులను చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?