Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరో కీలక వ్యక్తి అరెస్టు
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈయన గతంలో ప్రముఖుల వద్ద సీఏగా పనిచేశారు. అతడి అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. రామచంద్ర పిళ్లై వద్ద చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడు. ఈ కేసులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. అంతకుముందు అతని ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ, అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు బుచ్చిబాబు పాత్ర ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. అందుకే ఈ తెల్లవారుజామున బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టుకు ముందు పలుమార్లు ఢిల్లీకి పిలిపించి విచారించారు కూడా. అయితే.. అరెస్టయిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆపై విచారణ కోసం కస్టడీ కోరే అవకాశాలున్నాయి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం లో మరొకరిని అరెస్ట్ చేశారు. గౌతమ్ మల్హోత్రాను ఈడి అధికారులు అదుపులో తీసుకున్నారు.
Read also: Revanth Reddy: ప్రగతిభవన్ వాఖ్యలపై రేవంత్ స్పందన.. కేసులకు భయపడను కొత్త ఏమి కాదు
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
రామచంద్ర పిల్లి వద్ద చార్టెడ్ అకౌంట్ గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు గతంలో కూడా పలు ప్రముఖుల వద్ద వద్ద సీఏగా పనిచేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో కొన్ని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నందున గతేడాది సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా నలభై చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో దోమలగూడ అరవింద్ నగర్లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీ మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం సరికొత్త అనుమానాలకు దారి తీసింది. అప్పట్లో బుచ్చిబాబు పలు ప్రముఖులతో దిగిన ఫొటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తుల పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో ఇడి దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ను రూస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిశీలించి నిందితులకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో చార్జిషీట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురి ప్రముఖుల పేర్లు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
Woman trap: బాలికపై మరో మహిళ ట్రాప్.. యువకులకు అప్పగించి దారుణం
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!