Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..
- సిద్దిపేటకు బయో గ్యాస్ ప్లాంట్
- రైతులకు అదనపు ఆదాయం
- ఇంధన దిగుమతులపై తగ్గింపు లక్ష్యం
- పెట్టుబడులకు కొత్త అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నర్మెట్టలో బయో గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2047 ఆర్థిక లక్ష్యాలను అందుకునే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం చేపట్టిన కొన్ని మంచి పథకాలను కూడా ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు.
Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘హరుడు’!
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
ప్రస్తుతం మన దేశానికి అవసరమైన ఇంధనంలో 65 శాతం ఇతర దేశాల నుండి దిగుమతి అవుతోందని, అంతర్జాతీయ యుద్ధాల వల్ల క్రూడాయిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో కాలుష్య రహితమైన బయో గ్యాస్ ఫ్యాక్టరీలు ఎంతో అవసరమని, డిసెంబర్ నాటికే ఈ ప్లాంట్ అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ పరిశ్రమల అవసరం ఉంటే అక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.
సిద్దిపేట ప్రాంతానికి బయో గ్యాస్ ప్లాంట్ రావడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు సమృద్ధిగా అందుబాటులోకి రావడం వల్లే ఈ ప్రాంతానికి కంపెనీలు తరలివస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ ప్లాంట్ వల్ల రైతులకు రెట్టింపు లాభం చేకూరుతుందని, వరి ధాన్యంతో పాటు వరి గడ్డిని అమ్మడం ద్వారా కూడా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. బయో ఫ్యూయల్స్ అందుబాటులోకి వస్తే యుద్ధాలు సంభవించినా దేశంలో గ్యాస్ కొరత ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది
మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. గడ్డితో గ్యాస్ తయారు చేయడం అద్భుతమైన ప్రక్రియ అని, ఇది ఇంధన కొరతను తీరుస్తుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ వారు సోదరభావంతో మెలగాలని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అదే విధంగా తెలంగాణ వారు పెట్టుబడులు పెట్టేందుకు అమరావతిలో కూడా అవకాశాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’లో పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!